వీకెండ్ వచ్చిందంటే సినీ ప్రేమికులు అందరూ సినిమాకు వెళ్లి ఆ వీకెండ్ హాయిగా గడిపేద్దామని  ట్రై చేస్తూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే సినిమాలకు కొదవే ఉండదు ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా విడుదల అవుతూ ఉంటుంది ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే సినిమాకు వెళ్ళాక మాత్రం సినిమా నిరాశ పరిస్తే  ఆ వీకెండ్ మొత్తం సాడ్ గా  గడిచి పోతుంది. అందుకే ఏ సినిమా చూడాల అని  పదిసార్లు ఆలోచించిన  తర్వాతే సినిమా చూడడానికి వెళుతూ ఉంటారు సినీ ప్రేక్షకులు. ప్రస్తుతం ట్రేండింగ్ లో  ఉన్న సినిమాలలో ఈ వీకెండ్ సినీ ప్రేక్షకులు ఏ సినిమాలు చూస్తే బెస్ట్ అంటే వారికి ఉన్న ఆప్షన్లు ఇవే. శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్ గా తమిళ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్ లో వచ్చిన జాను మూవీ ప్రస్తుతం ట్రెండ్ లో  ఉంది. 

 


 ప్రస్తుతం జాను సినిమా తప్ప బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకర్షించడం లేదు. అంతే కాకుండా ఏ పెద్ద హీరో సినిమా కూడా విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో ప్రస్తుతం ప్రేక్షకులందరికీ ఇదే ఫస్ట్ అప్షన్  అయిపోయింది. అంతేకాకుండా ఈ సినిమాలో మంచి లవ్ ఎమోషనల్ వుండడంతో అటు ప్రేక్షకులు కూడా సినిమాను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. జాను  సినిమాలో శర్వానంద్ సమంత లాంటి మంచి నటులు నటించడంతో ఈ సినిమాలో నటన పరంగా అద్భుతంగా ఉండడంతో పాటు లవ్ ఎమోషన్ కూడా ఎంతో బాగుంటుందని భావించి ప్రేక్షకులు వీకెండ్లో ఈ సినిమా చూడ్డానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. 

 


 ఈ సినిమానే కాకుండా ప్రస్తుతం అలా వైకుంఠపురములో సినిమా కూడా ట్రేండింగ్ లోనే  ఉంది అని చెప్పాలి. ఒకవేళ ఇప్పటి వరకు మీరు అలా వైకుంఠపురములో సినిమా చూడకపోతే ఆ సినిమా చూడటం ఎంతో మేలు.  ఎందుకంటే అలా వైకుంఠపురములో ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ వీకెండ్ కాస్త హ్యాపీ వీకెండ్ గా మారిపోతుంది. అయితే అల వైకుంఠ పురములో సినిమా తర్వాత విడుదలైన రవితేజ హీరోగా వచ్చిన డిస్కో రాజా సినిమా మాత్రం ఇప్పటికే చాలా థియేటర్లలో ఎత్తేసారు కూడా. దీంతో అటు ప్రేక్షకులు కూడా డిస్కో రాజా సినిమా చూడడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్ యూత్ అందరికీ జాను సినిమా వీకెండ్ లో చూడడానికి కేరాఫ్ అడ్రస్ అయితే... ఫ్యామిలీ ఆడియన్స్ చూడడానికి అలా వైకుంఠపురములో సినిమా గుడ్ ఆప్షన్ అనే చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ వీకెండ్ ని సినీ వికెండ్  గా మార్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: