పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ ప్రధాన పాత్రలో పింక్ సినిమా రీమేక్ ప్రారంభమైంది. ఈ సినిమాలో పవన్కు హీరోయిన్ ఉండే అవకాశం లేదు. ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సినిమాలో పవన్కు జోడిని వెతికే పనిలో ఉన్నాడు దర్శకుడు క్రిష్. ఇప్పటికే ఈ సినిమాలో పవన్కు హీరోయిన్గా కియారా అద్వానీని తీసుకున్నారన్న వార్తలు వినిపించాయి. గతంలో అబ్బాయి రామ్ చరణ్తో కలిసి నటించిన కియారా ఇప్పుడు బాబాయ్ పవన్తో కూడా రొమాన్స్కు రెడీ అంటుదన్న టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాలో పవన్కు జోడిగా నటించేందుకు కియారా నో చెప్పిందట. పవన్ లాంటి క్రేజీ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా కియారా ఎందుకు నో అందా అని అంతా షాక్ అవుతున్నారు.
అయితే కియారా నిర్ణయం వెనుక పెద్ద కారణమే ఉందట. పవన్ సినిమాల్లో హీరోయిన్కు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. సినిమా అంతా వన్మేన్ షోలా పవన్ చుట్టూనే తిరుగుతుంది. అందుకే అలాంటి సినిమాలో నటిస్తే తన కెరీర్కు ఏ మాత్రం ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతోనే కియారా ఈ నిర్ణయం తీసుకుందట. దీంతో పవన్కు మరో జోడిని వెతికే పనిలో ఉన్నారు క్రిష్ అండ్ టీం.
కియారా నో అనటంతో ఆమె స్థానంలో బాలీవుడ్ బ్యూటీ వాణీకపూర్ను సంప్రదిస్తున్నారట. క్రిష్ దక్షిణాది భామలను కాదని బాలీవుడ్ హీరోయిన్లనే వెతకటంపై కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న క్రిష్, పవన్ సినిమాను పాన్ ఇండియాలో లెవల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే బాలీవుడ్ భామల వెంటపడుతున్నారట చిత్రయూనిట్.