టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సోలో బ్రతికే సో బెటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాను ట్విట్టర్ వేదికగా కొన్ని ట్వీట్స్ చేస్తూ తన తదుపరి సినిమా పై ఆసక్తిని రేపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తాను ఒకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. సాయి ధరమ్ తేజ్ తన అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంటుండగా.. మంచు విష్ణు సాయి ధరమ్ తేజ్ కి ఒక ఝలక్ ఇచ్చాడు.

 

అయితే వెంటనే స్పందించిన సాయి ధరమ్ తేజ్ కూడా కౌంటర్ ఇచ్చాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య కొనసాగిన ఈ సంభాషణ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అని తన ట్విట్టర్ ఖాతాలో చెబుతూ.. అందుకు గల కారణాలను కూడా చెప్పాడు. 'ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే నేను పెద్దగా టెన్షన్ పడను. రెస్టారెంట్ కు పోతే నా ఫుడ్ కి మాత్రమే బిల్లుని పే చేస్తాను. క్రికెట్ ఆడే సమయంలో కాల్ వచ్చి మధ్యలోనే ఆట ఆపేసి పోవాల్సిన అవసరం నాకు రాదు. నాకు నచ్చిన అంత టైమ్ ని నచ్చిన వాటితో స్పెండ్ చేయొచ్చు', అని చెప్పాడు.

 


ఇది చదివిన అభిమానులు కూడా సాయి ధరమ్ తేజ్ అభిప్రాయాన్ని కొనియాడుతూ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు.. 'తమ్ముడు.. మై లిటిల్ బ్రదర్. నేను ఈ ట్వీట్ ని సేవ్ చేసుకున్న. ఇంకా నువ్వు ఎన్ని రోజులు సోలో గా ఉంటావో నేను చూస్తా', అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. 'హహహహ.. విష్ణు అన్న మీ మాదిరిగా అందరికీ అదృష్టం ఉండాలి కదా', అని రిప్లయ్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: