తెలుగు లో నందమూరి బాలకృష్ణ నటుడిగా, రాజకీయ నేతగా తన సత్తా చాటుతున్నారు.  ఇప్పటి వరకు బాలయ్య వంద చిత్రాలకు పైగా నటించిన విషయం తెలిసిందే.  క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘గౌగమి పుత్ర శాతకర్ణి’ మూవీతో తన వంద చిత్రాలు పూర్తి చేసుకున్నారు.  ఆ చిత్రం తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ చిత్రంలో మునుపెన్నడూ లేని విధంగా మాస్ లుక్ తో కనిపించారు.  ఈ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు.. కానీ బాలయ్య యాక్షన్ కి మంచి పేరు వచ్చింది.   బాలకృష్ణ నటించిన చిత్రాలు వరుసగా ఫెయిల్యూర్స్ అవుతూ వచ్చాయి. 

 

మరోసారి క్రిష్ దర్శకత్వంలో తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీర్ బయోపిక్ రెండు భాగాలుగా తీశారు.  ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు గా రిలీజ్ చేశారు.  కానీ ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.  ఎన్నో అంచనాల మద్య రిలీజ్ అయిన ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవండంతో ఆలోచనలో పడ్డారు బాలయ్య.  ఇంతలోనే ఏపిలో ఎన్నికలు రావడం పూర్తిగా రాజకీయాల వైపు వెళ్లారు.  హిందూపురం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  మరోసారి వెండితెరపై మెరిసేందుకు సిద్దమైన ఆయన ఆ మద్య రూలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  కానీ ఈ చిత్రం కూాడా దారుణమైన డిజాస్టర్ అయ్యింది.  దాంతో తనకు గతంలో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన బోయపాటి శ్రీనివాస్ నే నమ్ముకున్నాడు.  వీరిద్దరి కాంబినషన్ లో ఇఫ్పుడు ఒక చిత్రం వస్తుంది. 

 

ఈ చిత్రంలో నయనతార నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఈ చిత్రంలో బాలయ్య అఘోరా గా కనిపించబోతున్నారట.  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ పాత్ర ఉండబోతుందట. చిత్రం షూటింగ్ 26 నుంచి వారణాశిలో జరగనుందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి వుండగా, బాలయ్య లుక్ ను మార్చాలని నిర్ణయించుకున్న బోయపాటి, అందుకోసం మారేందుకు సమయాన్ని ఇస్తూ, కాస్తంత ఆలస్యమైనా ఫిల్మ్ పర్ ఫెక్ట్ గా రావాలని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: