టాలీవుడ్ లో కేర్ ఆఫ్ మాస్ యాక్షన్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు బాలకృష్ణ. మొదటినుంచి మాస్ ప్రేక్షకులను అలరిస్తూ తనదైన పవర్ ఫుల్ డైలాగ్ లతో అద్భుతమైన మాస్ యాక్షన్తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకొని ప్రస్తుతం సీనియర్ హీరో గా కొనసాగుతున్నాడు బాలకృష్ణ. అయితే బాలకృష్ణ కు మాస్ యాక్షన్ ని అదిరిపోయేలా తెరకెక్కించిన దర్శకుడు.. బోయపాటి శ్రీను తోడైతే... ఇక నందమూరి అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ సినిమాలో మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఉర్రూతలూగించి మంచి విజయాలను అందుకున్నాయి.

 

 

 అయితే గత కొంత కాలంగా బాలకృష్ణకు సరైన హిట్ లేక పోవడంతో మరోసారి తన సక్సెస్ సీక్రెట్ అయినా బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వాస్తవంగా చెప్పాలంటే బాలకృష్ణ మాస్ యాక్షన్ ను సరిగ్గా  ఒడిసిపట్టి ప్రేక్షకుల ముందుకు తెచ్చింది బోయపాటి శ్రీను అని చెప్పాలి. అయితే ప్రస్తుతం బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ కూడా జరుగుతోంది. కాగా ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 26 నుంచి వారణాసి లో జరగనున్నట్లు సమాచారం. బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. ఇందులో ఒకటి అఘోరా గా  కనిపించబోతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది.

 

 

 

 వాస్తవానికి అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా... బాలయ్య ను పూర్తిగా మార్చాలని నిర్ణయించుకున్న బోయపాటి అందుకోసం మరింత సమయం ఇస్తూ కాస్తంత ఆలస్యమైన... సినిమా పర్ఫెక్ట్ గా రావాలని భావిస్తున్నారట. ముఖ్యంగా బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో బాలకృష్ణ  అఘోరాగా  కనిపించే సన్నివేశాలు కీలకంగా ఉంటాయి అని సినీ వర్గాల నుంచి సమాచారం కూడా వస్తుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శ్రియ నయనతార ఈ సినిమాలో కథానాయకుల అని ప్రచారం జరుగుతోంది మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: