తన మీద వచ్చే కామెంట్స్ ఎప్పటికప్పుడు ఘాటుగా రిప్లై ఇవ్వటం తాప్సీకి అలవాటు. ముఖ్యంగా సోషల్ మీడియాతో చేసే కామెంట్స్‌పై తనదైన స్టైల్‌లో స్పందించే తాప్సీ తాజాగా మరోసారి అలాంటి స్ట్రాంగ్‌ రిప్లైతో ఓ నెటిజెన్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. నిన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల సందర్భంగా తన షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చి మరి ఢిల్లీ వెళ్లి కుటుంబ సమేతంగా ఓటు వేసింది తాప్సీ. ఓటు వేసిన తరువాత ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసింది.


ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజెన్‌.. `చాలా రోజులు క్రితమే ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిపోయిన వాళ్లు ఇప్పుడు వచ్చి ఇక్కడ ఓటు వేయటం ఏంటి.? ముంబై ఉండే వాళ్లు మా పాలకులను నిర్ణయిస్తారా?` అంటూ తాప్సీ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై స్పందించిన తాప్సీ ఆ నెటిజెన్‌కు బాగానే గడ్డి పెట్టింది. నేను ముంబైలో షూటింగ్‌ల నిమిత్తం ఉంటున్న ఎక్కువ సమయం ఢిల్లీలోనే గడుపుతున్నాను.

 

అంతేకాదు నా ఇన్‌కం ట్యాక్స్‌ ఇతర లావాదేవీలన్ని ఢిల్లీ నుంచే కడుతున్నాను. చాలా మంది ఇలాంటి విషయాల్లో సొంత రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు. అలాంటి వాళ్లకన్నా నేను చాలా బెటర్‌. నా స్థానికతను ప్రశ్నించకుండా ముందు మీరు సొంత ప్లేస్‌ కోసం ఎంత చేస్తున్నారో చూసుకొండి` అంటూ ట్వీట్‌ చేసింది తాప్సీ. ఆమె రిప్లైకి మిశ్రమ స్పందన వస్తోంది.


ప్రస్తుతం బాలీవుడ్ వరుసగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తున్న తాప్సీ, ఎక్కువగా బయోగ్రాఫికల్‌ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం తప్పడ్‌తో పాటు హసీన్‌ దిల్‌రుబా సినిమాల్లో నటిస్తోంది. చాలా కాలం తరువాత సౌత్‌లో సినిమాలవైపు కూడా మొగ్గు చూపుతోంది తాప్సీ. గత ఏడాది గేమ్‌ ఓవర్ సినిమాతో సౌత్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాప్సీ, మరిన్ని సినిమాలు ఇక్కడ చేసేందుకు ప్లాన్‌ చేసుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: