తెలుగు ఇండస్ట్రీలో భలే భలే మగాడివోయ్ చిత్రం తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న నేచురల్ స్టార్ నాని గత ఏడాది జర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు.  అయితే కథల విషయంలో చాలా జాగ్రత్తగా సెలెక్టెడ్ గా ఎంచుకునే నాని ఈ మద్య నిర్మాతగా కూడా మారారు.  ఇక నాని కెరీర్ లో ది బెస్ట్ చిత్రంగా ‘నేను లోకల్’ నిలిచింది.  ప్రేమించిన అమ్మాయి కోసం తన ప్రాణాలు కూాడా ఇవ్వడానికి తెగించే ఓ యువకుడి పాత్రలో నటించారు నాని.  ఈ మూవీలో మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ నటించింది.  వీరిద్దరి కెమిస్ట్రీ ఎంతో బాగా వర్క్ ఔట్ అయ్యింది.   తాజాగా ఈ మూవీ టీమ్ మరోసారి కలబోతున్నట్లు టాలీవుడ్ లో సమాచారం వినిపిస్తుంది.  ఇప్ప‌టికే ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో `వి` చిత్రాన్ని పూర్తి చేసిన నాని దీన్ని మార్చి 25న రిలీజ్‌కి రెడీ చేసేశారు.

 

ఆ వెంట‌నే శివ నిర్వాణ‌తో `ట‌క్ జ‌గ‌దీష్‌`ని మొద‌లుపెట్టేశాడు. ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఇందులో నాని కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.  నాని ‘టాక్సీవాలా` ద‌ర్శ‌కుడు రాహుల్ సంక్రీత్య‌న్‌తో ఓ చిత్రానికి క‌మిట్ అయిపోయారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌. రాధాకృష్ణ నిర్మించ‌నున్నారు.  కాకపోతే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ త్వరలో వెల్లడిస్తారని అంటున్నారు.  అయితే ఈ చిత్రాలతో పాటు నాని మరో చిత్రానికి కూడా కమిట్ అవుతున్నట్లు సమాచారం.  

 

`నేను లోక‌ల్‌` ఫేమ్ త్రినాథ‌రావు న‌క్కిన‌తోనూ ఓ చిత్రాని కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది. దీనికి ప్రొడ్యూస‌ర్ ఎవ‌రన్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు. అయితే ఇందులో హీరోయిన్ కూడా ఇంకా ఎవరు అన్న విషయం ఇంకా తెలపలేదు.  అయితే ఈ విషయాలు కూడా త్వరలో అనౌన్స్ మెంట్ చేస్తారన్ని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: