ఏ త‌ల్లైనా స‌రే త‌న పిల్ల‌లు మంచి స్టేజ్‌కి రావాల‌ని. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌ల‌తో ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. అలాగే ఎంతో ఉన్న‌త‌స్థాయికి వ‌చ్చి ఎన్నో ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించాల‌ని ప్ర‌తి త‌ల్లి త‌న బిడ్డ కోసం కోరుకుంటది. దీనికి వాళ్ళు ఎంత పెద్ద సెల‌బ్రెటీ త‌ల్లులైనా స‌రే అందుకు అతీతులేమీ కారు.  అమ్మ ఎవ‌రికైనా అమ్మే... సెల‌బ్రెటీలు  కూడా త‌ల్లికిచ్చే విలువ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇటీవ‌లె నంద‌మూరి ఫ్యామిలీ నుంచి ఒక హీరో త‌న త‌ల్లి గురించి చెప్పిన‌ మాట‌లు ఏమిటో చూద్దాం. 

 

జూనియ‌ర్ ఎన్టీఆర్ చిన్న‌ప్పుడు మ‌హా అల్లరి పిల్లాడు . గొడ‌వ బాగా చేసే వాడ‌ట‌. దీంతో వాళ్ల అమ్మ‌గారు బాగా కొట్టి ఆ త‌రువాత దెబ్బ‌ల‌కు ముందు రాసేవార‌ట‌. ఆమే దెబ్బ‌ల కొట్ట‌డం వెన‌క ..కొడుకు ప్ర‌యోజ‌కుడై మంచి గుర్తింపు తెచ్చుకోవాల‌న‌దే . ఆ విష‌యం అప్పుడు ఎన్టీఆర కు అర్దం కాక పోయినా.. హీరో అయిన త‌రువాత త‌ల్లి త‌న కోసం ఎంత ఆవేద‌న చెందేదో.. త‌నను ఆ స‌మ‌యానికి కొన్ని దెబ్బ‌లు కొట్టిన‌ప్ప‌ట‌కి .. ఆ త‌రువాత ఆమే క‌న్నీళ్లు పెట్టుకుంటూ క‌ష్ట‌ప‌డి జీవితంలో ఎద‌గాలిరా.. గుర్తింపు .. గౌర‌వం తెచ్చుకోవాలి అని చెప్పిన మాట‌లు మాత్రం ఎన్టీఆర్ కు గుండెల్లోకి వెళ్లాయి. అందుకే ఎన్టీఆర్ మాతృదేవోభ‌వ అంటున్నారు. అమ్మ ఆవేద‌న‌.. దండ‌న లేక పోతే త‌నంత‌టి వాడు అయ్యే వాడినే కాదంటూ త‌ల్లి గురించి ఎంతో ఆనందంగా చెప్పుకున్నారు ఎన్టీఆర్‌. సో క‌మ్మ‌నైనా అమ్మ దెబ్బ కూడా దీవెనే అంటే ఇదే క‌దా.!

 

ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్‌.ఆర్‌.ఆర్. చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టిస్తున్నాడు. డి.వి.వి. దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం లో హాలీవుడ్ హీరోయిన్ ఎన్టీఆర్ కి జోడిగా చేస్తుంది. ఇక ఈ చిత్రం 2021జ‌న‌వ‌రి8న విడుద‌ల తేదీని ఖ‌రారు చేసింది చిత్ర యూనిట్‌. అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: