టాలీవుడ్ న‌టి ఐటెం బాంబ్ జ్యోతి పేరు తెలియని వారుండరు. ఎంద‌కంటే ఆమె టాలీవుడ్ వ్యాంప్ క్యారెక్ట‌ర్స్‌లో ఎక్కువుగా న‌టించి, మెప్పించింది. గ‌త కొంతకాలంగా ఈ అమ్మ‌డుకు సినిమాల‌లో స‌రిగా అవ‌కాశాలు రావ‌డం లేదు. తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ క‌నిపించింది జ్యోతి. మొద‌టి సీజ‌న్‌లో ఫ‌స్ట్ ఎలిమినేష‌న్‌గా బిగ్‌బాస్ నుంచి బ‌యటికి వ‌చ్చేసింది. 

 

ఆ మధ్య ఈ భామ ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు, టాలీవుడ్ స‌న్సేష‌నల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండపై బొల్డ్ కామెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచింది. అలాగే పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో న‌టించాల‌ని నాకు బాగా కోరిక‌గా ఉంటుందని కూడా చెప్పడం విదితమే. అలాగే.. హీరోల సంగతి పక్కన పెడదాం.. మరి హీరోయిన్స్‌లో ఎవరంటే ఇష్టం అని అడిగితే.. హీరోయిన్స్ ఎవరున్నారబ్బా అంటూ.. నాకు ఎవరూ గుర్తుకు రావడం లేదు అనేసి సింపుల్ గా నవ్వేసింది.

 

గాని ఆపై ఆ మాటలు పెను దుమారాన్నే లేపాయి. సరే ఇపుడు ఆ తంతు ఎందుకు గాని, తర్వాత అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి. ఇక ఆమె అభిమానులైతే, వెండితెరపైన ఆమె అందాల ఆరబోతని చూడాలని తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మంది నటీనటులు పాపులర్ కావడానికి వివాదాలనే నమ్ముకుంటున్నారు. 

 

ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ, కత్తి మహేష్, శ్రీ రెడ్డి వంటి వాళ్లు పనితో నిమిత్తం లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ కావాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈమె కూడా అదే కోవకు చెందినదానిలా కనబడుతోంది. ఈమె తెలుగు సినిమాల్లో ‘పెళ్లాం ఊరెళితే’, మహాత్మ,రంగా ది దొంగ వంటి సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్‌తో ఫేమసైన అయిన సంగతి అందరికి తెలిసినదే. ఇక అక్కడినుండి ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: