కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ - టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్టు తెర‌కెక్క నుందా ?  మురుగ‌దాస్ సూర్య కాంబోలో వ‌చ్చిన గ‌జిని సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రానుందా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మురుగదాస్ సూర్యతో కోలీవుడ్లో తెరకెక్కించిన గ‌జినీ సినిమాను తెలుగులో బన్నీ తండ్రి అల్లు అరవింద్ తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ చేశారు. ఇక అరవింద్ 2009లో బాలీవుడ్ లో బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్‌తో ఇదే మురుగదాస్ దర్శకత్వంలో హిందీ గ‌జినీ నిర్మించారు. ఆనాడు హిందీ గజిని ఏకంగా రు. 200 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్కే దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చింది.

 

సినిమా తో  మురుగ‌దాస్ పేరు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఇక టాలీవుడ్ మార్కెట్ తో పాటు ఇప్పటికే కేరళ మార్కెట్ లో సైతం దూసుకుపోతున్న అల్లు అర్జున్... కొద్దిరోజులుగా కోలీవుడ్ మార్కెట్ పై గ్రిప్‌ సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది లింగుస్వామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేసినా.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అది ఆగి పోయింది. ఇక ఇప్పుడు బన్నీ - మురుగదాస్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.

 

తాజా సమాచారం ప్రకారం గజిని 2 అనే టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించింది గీతాఆర్ట్స్ కావడంతో ఇది బన్నీకోసమేనంటూ వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇక ఇటీవ‌ల ర‌జనీకాంత్‌తో ద‌ర్బార్ సినిమా తీసిన మురుగ‌దాస్ ప్ర‌స్తుతం గజిని 2పై  పూర్తి స్థాయిలో వర్క్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బన్ని సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. అది పూర్తయ్యేప్పటికి మురుగదాస్ ప్రీప్రొడక్షన్స్ పూర్తి చేసి వందశాతం స్క్రిప్టుతో రెడీగా ఉంటారట. ఈ సినిమాలో హీరోయిన్‌గా మ‌ళ్లీ త‌న‌కు క‌లిసొచ్చిన పూజా హెగ్డేను లాక్ చేసిన‌ట్టు టాక్‌..?

మరింత సమాచారం తెలుసుకోండి: