ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త చిత్రాల జోరు బాగా పెరిగిపోయింది. వరుసగా చిన్న చిత్రాలు మంచి కంటెంట్ తో రావడం.. మంచి విజయాలు సాధించడం చూస్తూనే ఉన్నాం. అయితే కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో హిప్పీ బ్యూటీ దిగంగన హీరోయిన్గా సస్పెన్స్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటోన్న సినిమా ‘వలయం’. ఈ చిత్రం ద్వారా లక్ష్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా టీజర్ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఈ డైలాగ్తో ఈ చిత్రం ట్రైలర్ ప్రారంభమవుతుంది.
‘ఆ తర్వాత ఎంతగా నచ్చావె పిల్లా’ అని పాటను వినిపించారు. అటు తర్వాత… హీరో భార్య దిశ కనపడకుండా పోతవడం, ఆమెకు లవ్ ఎఫైర్ ఉందని, ఆ కారణంగా హీరోనే చేంపేశాడని పోలీసులు భావిస్తారు. దీనిపైనే వేర్ ఈజ్ దిశా అనే టైటిల్స్తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. హీరో భార్య కనపడకుండా పోతుంది.ఆమెకు ఉన్న లవ్ ఎఫైర్ కారణంగా హీరోనే చేంపేశాడని పోలీసులు అనుమానిస్తుంటారు. ఉన్న ఆధారాల ఆధారంగా హీరో ఆమెను ఎలా కనుగొన్నాడనేదే కథాంశం అని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అసలు సీక్రెట్ తెలియాలంటే చిత్రం విడుదల వరకు ఆగాల్సిందే. దిశ! అమె ఎక్కడ? ఆమెకు ఏం జరిగింది? ఇదిగో అద్భుతమైన ట్రైలర్' అంటూ హీరో లక్ష్ ఈ సినిమా ట్రైలర్ను పోస్ట్ చేశాడు.
కాగా, ఈ సినిమాను రమేష్ కడుముల రూపొందిస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతం, రామకృష్ణ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చదలవాడ పద్మావతి ఈ చిత్రాలకు నిర్మాత. హీరో భార్య దిశ కనపడకుండా పోతవడంతో ఆమెకు లవ్ ఎఫైర్ ఉందని, ఆ కారణంగా హీరోనే చేంపేశాడని పోలీసులు భావిస్తారు. మొత్తానికి ఈ చిత్రం చూస్తే ప్రేక్షకులు చాలా థ్రిల్ అవుతారని అంటున్నారు చిత్ర యూనిట్.