బాలయ్య సినిమాల ద్వారా చాలా మంది హీరోయిన్లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఒక్కప్పుడు ఫామ్ లో ఉన్న హీరోయిన్లు ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. అయితే కొందరు మాత్రం సినిమాలలో అక్కడక్కడా మెరుస్తున్నారు. ఈ సందర్బంగా వెంకటేష్, బాలయ్య సరసన నటించిన రవీనా టాండన్ మళ్ళీ సినిమాలలో నటించినదాని రెడీ అవుతుంది ఈ మేరకు కె జీ ఎఫ్ 2 సినిమా నటించాడని రెడీ అవుతుందట.

 వివరాల్లోకి వెళితే .. కన్నడ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో చూశాం. యష్ ప్రధాన పాత్రలో బంగారు గనుల కథాంశంతో రిలీజైన ఈ సినిమా... విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్ మార్క్‌తో సెన్సేషన్ సృష్టించింది. ఐతే... ఫస్ట్ పార్ట్‌లో చాలా మంది నటులు ఎవరో కూడా తెలియదు. అదే తెలిసిన నటులతో సినిమాని నిర్మించి ఉంటే,ఇంకా ఎక్కువ పేరు వచ్చేదన్న ప్రచారం జరిగింది. అందుకే సెకండ్ పార్ట్‌లో ఫేమస్ యాక్టర్లను దించాలని ఫిల్మ్ మేకర్లు ప్లాన్ చేసారు.

 సీక్వెల్‌లో ఇప్పటికే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు తాజాగా ఈ సినిమాలో షూటింగ్‌లో రవీనా టాండన్ జాయిన్ అయింది. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ ఆమె కేజీఎఫ్ టీమ్‌లోకి స్వాగతం అంటూ వెల్కమ్ చెప్పాడు. ఈ సినిమాలో రవీనా టాండన్.. సంజయ్ దత్‌కు జోడిగా నటిస్తుందా లేదా మరోదైనా ఇంపార్టెంట్ రోల్ చేస్తుందా అనేది చూడాలి... 1990లో సంజయ్, రవీనా టాండన్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. 


ఇప్పుడు మళ్లీ వాళ్లిద్దరూ కలిసి నటిస్తుండటం ఆడియన్స్‌కి థ్రిల్లింగే. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా సెకండ్ పార్ట్ తెరకెక్కుతోంది. ఇక రవీనా టాండన్ తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో నటించింది. ఆ తర్వాత నాగార్జున సరసన ‘ఆకాశవీధిలో’ సినిమాలో యాక్ట్ చేసింది. అంతేకాదు మోహన్ బాబు తన కొడుకులిద్దరితో యాక్ట్ చేసిన ‘పాండవులు పాండవులు తుమ్మెదా’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఇక ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ముందుగా ప్రకటించిన జూలై 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. మరి ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: