జూనియర్ ఎన్టీఆర్.. పరిచయం అక్కర్లేని పేరు.. నందమూరి వారసుడుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన తన క్రేజ్ తో, డ్యాన్స్ తో మంచి పేరును తెచ్చుకున్నాడు. ఈ సందర్బంగా ఎందరో ఫ్యాన్స్ ను కూడా పోగేసుకున్నారు. అయితే ఇన్నో సినిమాలలో నటించిన ఈయన మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఫ్యాన్స్ ను నా కుటుంబం అనుకుంటూ వస్తున్నా అయన పట్ల ఎందరి ప్రశంసలు అందుకుంటూ వస్తున్నారు. ఆయన అభిమానులు కూడా అంతే చేస్తున్నారు. అయితే ఇప్పుడు అయన ఫ్యాన్స్ చేసిన పనికి చాలా మంది షాక్ కు గురవుతున్నారు. 


జూనియర్ ఎన్టీఆర్.. తాత సీనియర్ ఎన్టీఆర్ నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి అంచలంచులుగా ఎదుగుతూ.. తెలుగు ఇండస్ట్రీలో తన కంటూ సెపరేట్ ఇమేజ్  క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు ఆపదలో ఉన్నవారికి కూడా తనవంతు సాయం అందించడంతో ముందుంటాడు. సేవాకార్యక్రమాలు చేయడంలో కూడా తాతకు ఏ మాత్రం తగ్గదు అంటూ పలువురు అంటున్నారు. 


ఇకపోతే ఆయన అభిమానులు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు వీళ్లు కూడా కష్టాల్లో ఉన్నవారికి తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ఆకలితో బాధపడే అనాథల కోసం జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు సంబంధించిన టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యులు కొంత మంది కలిసి ‘డొనేట్ ఏ మీల్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫుట్‌పాత్‌ల మీద జీవిస్తూ.. అన్నం కోసం ఎదురు చూసే వాళ్ల కోసం టీమ్ తారక్ ట్రస్ట్ సభ్యలు గత యేడాదిగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.


 తాజాగా ‘టీమ్ తారక్ ట్రస్ట్’ సభ్యులు ‘డినేట్ ఏ మీల్’ అనే ఈ ప్రోగ్రామ్‌‌కు సంబంధించిన పోస్టర్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తన మహతి స్టూడియోలో ఆవిష్కరించారు. అంతేకాదు ఆకలితో బాధపడే అన్నార్తుల కోసం టీమ్ తారక్ ట్రస్ట్ కొన్నాళ్లుగా చేస్తున్న ప్రజాపయోగ కార్యక్రమాలను ఆయన అభినందించారు.  ఆకలితో బాధపడే అన్నార్తులకు తారక్ ట్రస్ట్ అండగా ఉండటం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఫ్యాన్స్ అంటే కేవలం సినిమాకు హంగామా చేయడమే కాదు ఇలాంటివి కూడా చేస్తారని నిరూపించిన పలువురి చేత శభాష్ అనిపించుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: