టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరు గాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠుపురములో సినిమాతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించగా, గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. నిజానికి రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసి ఘోరంగా ఫ్లాప్ కావడంతో కొంత ఆలోచనలో పడ్డ త్రివిక్రమ్

 

అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత అనే యాక్షన్ మూవీని తీసి హిట్ కొట్టగా, ఇటీవల అలవైకుంఠపురములో ఆయనకు మరొక విజయాన్ని అందించింది. ఇకపోతే అతి త్వరలో ఆయన, ఎన్టీఆర్ తో మరొక సినిమా చేయనున్నారని, ఆ సినిమాకు అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ నేడు అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, తదుపరి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేసేది నిజమే అయినప్పటికీ, ఆ సినిమా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరింత ఆలస్యం అవనుందని అంటున్నారు. 

 

ఇప్పటికే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్, ఆ షూటింగ్ పూర్తి చేసుకుని త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ కావడానికి చాలా సమయం ఉన్నందున, ఈ మధ్యలో మహేష్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేస్తారని అంటున్నారు. అతి త్వరలో వంశీ పైడిపల్లి సినిమాలో నటించనున్న మహేష్, దానితో పాటే త్రివిక్రమ్ సినిమాలో కూడా నటిస్తారని, ఆ సినిమాని జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక సమాచారం మాత్రం వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: