టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని, మొదటగా ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే. అయితే మొదటి సినిమాతో మంచి హిట్ అందుకోవడంతో పాటు ప్రేక్షకుల దృష్టిని మొత్తాన్ని తన వైపుకు త్రిప్పుకుంది సమంత. అలానే ఆ తరువాత వరుసగా ఆమెకు వచ్చిన ఆఫర్లు కూడా మంచి సక్సెస్ లని అందించడంతో టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా సమంత పేరు మారుమ్రోగింది. కేవలం టాలీవుడ్ లోనే కాక అటు కోలీవుడ్ లో కూడా సమంతకు పలువురు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కడం, 

 

ఆమె వాటితో మంచి విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించడం జరిగింది. ఇక ఇటీవల తన తొలి సినిమా హీరో అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి, అందరినీ ఒప్పించి వివాహం చేసుకున్న సమంత, పెళ్లి తరువాత మాత్రం ఒకింత జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. గత ఏడాది యు టర్న్, అలానే ఓ బేబీ సినిమాలతో మంచి సక్సెస్ లు ఆమె అందుకుంది. ఇక ప్రస్తుతం శర్వానంద్ తో కలిసి ఆమె నటించిన హృద్యమైన ప్రేమకథా చిత్రం జాను, మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ టాక్ తో ముందుకు నడుస్తోంది. ఇక ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క సినిమాతో తన ఇమేజ్ ని మరింతగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్న సమంత

 

జాను సక్సెస్ తో నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇక ఆ తరువాత హైదరాబాద్ చేరుకున్న సమంత, నేడు లేత గోధుమ రంగు చీరలో ఫోజులిచ్చిన అనంతరం జాను సక్సెస్ మీట్ లో పాల్గొంది. అయితే ఆ ఫోటోలు గమనిస్తే ఆమె కట్టుకున్న చీర పై జాను సినిమా టైటిల్ ముద్రించి ఉండడం గమయించవచ్చు. ఇక ఆమె కట్టుకున్న చీర ఫోటోలు కాసేపటి క్రితం సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ అయి, విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక ఆ చీరలో సమంత అందాలను చూసిన పలువురు ఫ్యాన్స్, వామ్మో, మీ సినిమా ఎంత హిట్ అయినా, ఏకంగా చీర మీద ఆ సినిమా టైటిల్ వేయించుకోవడం ఏంటి సమంత అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: