విజయ్ దేవరకొండ.. ఈ పేరు తెలియనిది కాదు.. ఎప్పుడు యాక్టీవ్ గా అల్లరల్లరి చేస్తూ.. బిజినెస్ లు పెడుతూ జీవితాన్ని ఆలా గడిపేస్తున్న విజయ్ దేవరకొండ తెలియని వారు ఉండరు.. పెళ్లి చూపులు సినిమాతో సైలెంట్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ అర్జున్ రెడ్డి యట్టిట్యూడ్ తో ప్రేక్షకులకు దగ్గర అయిపోయాడు.. 

 

నిజానికి ఆ సినిమా ఈ కాలం వారికీ ఒక అద్భుతం అనే చెప్పాలి.. ఇంకా ఆ సినిమా అప్పట్లో కొన్ని వివాదాలకు కారణమైన సినిమా మాత్రం సూపర్ హిట్ అయ్యింది.. ఇంకా ఆ తర్వాత విజయ్ స్టార్ తిరగడంతో ఆ తర్వాత వచ్చిన చిత్రం కూడా గీత గోవిందం చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో విజయ్ దేవరకొండ జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది అనుకోండి. 

 

ఇంకా అలాంటి విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈ వాలంటైన్స్ డే సందర్భంగా వరల్డ్ ఫేమస్ లవర్ తో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న ఓ గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో ఎన్నో ఆసక్తికర విషయాలు జరిగాయి.. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకలో కొన్ని విషయాలను వెల్లడించాడు విజయ్ దేవరకొండ. 

 

అవి ఏంటి అంటే ? విజయ్ దేవరకొండ తీసే ఆఖరి ప్రేమ కథ చిత్రం ఇది అని.. అందుకే అన్ని రకాల ఎమోషన్స్ ఈ సినిమాలో ఉండేలా ఈ సినిమాలో చేసుకున్నట్టు.. ఇంకా ప్రేమ కథ చిత్రాలు ఏవి తియ్యను అని విజయ్ దేవరకొండ వెల్లడించాడు. ఈ సినిమా కోసం హీరోయిన్లు చాలా కష్టపడ్డారు అని విజయ్ వెల్లడించాడు.. 

 

ఆ సమయంలో హీరోయిన్లపై సెటైర్లు.. కామెడీ చేసుకుంటూ.. అక్కడే ఉన్న ఐశ్వర్యరాజేష్ తో ''ఏందే నీ యవ్వ.. 'గారు గారు' అంటున్నవ్' అంటూ సరదా సంభాషణ జరిపాడు. ఇలా ఐశ్వర్యరాజేష్ ని విజయ్ సరదాగా తిట్టడం ఆ వేడుకలో అందరిని నవ్వించింది. మరి ఈ సినిమా ఎంత హిట్ అవుతుంది అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: