అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ సమంత... ఎన్నో ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ... ఇమేజ్ ను సంపాదించుకుంది. ఎంతో  మంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది సమంత. సమంత చిలిపి నవ్వు నవ్వింది అంటే ఎంతో మంది ప్రేక్షకుల మనసు ఢమాల్ అని ప్రేమలో  పడిపోతుంది. ఇప్పటివరకు ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించింది ఈ అమ్మడు . ఏ సినిమా చేసినా అందులో ఎంతో క్యూట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఫేస్ కు  గుర్తుగా ఉంటుంది సమంత. ఏ ఫంక్షన్ కి వచ్చిన ఏ  సినిమా ఈవెంట్లో అయినా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. క్యూట్ క్యూట్ మాటలతో మనుసులను  కొల్లగొడుతుంది. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ లో మంచి మంచి కథలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది. 

 


 ఇప్పుడు వరకు ప్రేక్షకులను ఎంతో క్యూట్ గా చిలిపి నవ్వుతూ అలరించిన సమంత... సీరియస్ గా మారబోతున్న అని అంటుంది. విలన్ పాత్ర చేయబోతున్నాను అంటూ ప్రకటించింది. తాను విలన్ పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతుంది అంటూ ప్రకటించింది. తన విలన్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో సర్ప్రైస్ చేస్తుంది అంటూ తాజాగా ప్రకటించింది సమంత. అటు అభిమానులు మాత్రం సమంత ఇచ్చిన సర్ ప్రైజ్ ఫై ఆసక్తి గా లేనట్లు  తెలుస్తుంది. ఎందుకంటే సమంతను ఎంతో అందంగా కనిపించే చిలిపి  నవ్వుతూ ఉండే సమంతను  మాత్రమే చూడగలమని... సీరియస్ గా ఉంటే చూడలేము  అంటూ అభిమానులు చెబుతున్నారు. అయితే తనని తాను నటిగా మరింత నిరూపించుకునేందుకు నెగిటివ్ పాత్రలో కూడా నటిస్తున్నట్లు సమంత తెలిపింది. 

 


 ఇకపోతే నాగచైతన్యతో పెళ్లి తర్వాత అక్కినేని కోడలిగా మారి  కథలు ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అంతేకాదు నాగచైతన్యతో పెళ్లయిన తర్వాత వైవిధ్యమైన నటనతో ప్రాధాన్యం ఉండే కథలలో నటిస్తూ నటిగా తానేమిటో నిరూపించుకుంది సమంత. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. అంతేకాకుండా యూటర్న్ ఓ బేబీ లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మంచి విజయాలను కూడా అందుకుంటుంది. తాజాగా జాను చిత్రం కూడా ఈ కోవకు చెందిందే. జాను చిత్రంలో సమంత నటనకు గాను విమర్శకుల ప్రశంసలు కూడా దక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఏకంగా శర్వానంద్ ను  సైతం డామినేట్  చేసి తన నటన తో అదరగొట్టింది  సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: