ప్రతి సినిమా అలాగే ఉండాలనకుంటా.  టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత నాని నటించిన ఎవడే సుబ్రమణ్యం మూవీలో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు.  ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.  ఈ మూవీ టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకు మంచి అవకాశాలు కల్పించేలా చేసింది. సందీప్ వంగా దర్శకత్వంలో ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఏకంగా స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ఈ మూవీలో అర్జున్ రెడ్డి బోల్డ్ యాక్టింగ్, లవ్ సెంటిమెంట్ అన్నీ బాగా కలిసి వచ్చాయి.  మొత్తానికి ఈ మూవీతో స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ తర్వాత గీతాగోవిందం మూవీతో మరో బాక్సాఫీస్ హిట్ అయ్యింది.  పరుశరామ్ తెరకెక్కించిన ఈ మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది.  

 

ఈ మూవీలో నటించిన రష్మిక మందన, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ ఔట్ అయ్యింది.  ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీతో ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  విజయ్‌ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్‌, కేథరిన్‌, ఇజబెల్‌ లైట్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు.  నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది.  ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ఇది నా తొమ్మిదో సినిమా. నాలుగేళ్లలో చాలా చూశాను. 

 

 నాలుగేళ్లుగా మీరు నాతోనే ఉన్నారు.  ‘అర్జున్‌ రెడ్డి’ చేసిన.. ఆ తర్వాత ‘మేడం మేడం’ అంటూ.. ‘గీత గోవిందం’ చేశా. తమిళం రాకున్నా భాష నేర్చుకొని ‘నోటా’ మూవీలో నటించాను.   ‘డియర్‌ కామ్రేడ్‌’ తో మరోసారి రష్మిక, నేను మీ ముందకు వచ్చాం.. కానీ సక్సెస్ కాలేక పోయాం అన్నారు.  ఈ సారి  ప్రేకథలు మనుషులు, పల్లెటూరు, హైదరాబాద్‌, పారిస్‌ ఇలా సాగిపోతుంది. ప్రతి సినిమా సక్సెస్ సాధించాలని.. మంచి లాభాలు రావాలనే హీరో, చిత్ర నిర్మాతలు, దర్శకులు ఆలోచిస్తారు.  ఈసారి నేను మంచి హిట్ కొట్టాలనే మీ ముందుకు వస్తున్నాను.. ఆశీర్వదించి సక్సెస్ అయ్యేలా చేయండి అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: