మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురంలో' చిత్రం సంక్రాంతి సీజన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కి పోటీగా దిగిన విషయం తెలిసిందే. పోటీ హోరాహోరీగా ఉంటుంది అని అందరూ అనుకున్న నేపథ్యంలో కేవలం వారం రోజుల్లోనే మహేష్ బాబు సినిమాను ఒక రేంజ్ లో కొట్టేశాడు స్టైలిష్ స్టార్. రిలీజ్ కు ముందు మహేష్ బాబు సినిమాకే ఎక్కువ కలెక్షన్ వస్తుందని మెజారిటీ ప్రజలు భావిస్తే దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో మహేష్ లాంటి సూపర్ స్టార్ ను వెనక్కి నెట్టిన అల్లు అర్జున్ తన మార్కెట్ వ్యాల్యూ ఏంటో సినిమాతో తెలియచెప్పాడు.

 

అంతటితో ఆగకుండా పండుగ అయిపోయిన తర్వాత కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేస్తూ సాగిన అతని వీరంగం బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టే దగ్గర ఆగింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కన్ను రాజమౌళి పై పడింది. ఖైదీ మరియు రంగస్థలం చిత్రాలను కొట్టిన ఊపులోనే అల్లు అర్జున్ తర్వాత చిత్రానికి అందనంత ఎత్తులో 'అల వైకుంఠపురంలో' ఉండాలని డిసైడ్ అయినట్లు సమాచారం. దానితోపాటు మంచి ఫామ్ లో ఉన్న సుకుమార్ తో తన తర్వాతి చిత్రం చేస్తున్న అల్లు అర్జున్ చిత్రాన్ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడట.

 

మొన్ననే రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోగా పెట్టి తీస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కానుందని ప్రకటించాడు. అయితే ఇప్పుడు పిచ్చ ఊపులో ఉన్న అల్లు అర్జున్ సినిమా కనుక దిగితే బాహుబలి కి భిన్నంగా చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావని రాజమౌళి భయం. అదీ కాకుండా అల్లు అర్జున్ తన నాన్ బాహుబలి రికార్డును కూడా తద్వారా కాపాడుకున్నట్టు అవుతుంది. ఏదేమైనా బన్నీ ఊపు చూస్తుంటే ఇప్పటిలో ఆగేలా లేడు.

మరింత సమాచారం తెలుసుకోండి: