భారతీయ చలన చిత్ర రంగంలో చెరగని ముద్ర వేసిన నటి అతిలోక సుందరి శ్రీదేవి బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది.  ఎన్నో చిత్రాల్లో బాలనటిగా నటించి మెప్పించిన శ్రీదేవి హీరోయిన్ గా మారిన తర్వాత అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది.  తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన శ్రీదేవి నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న సమయంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  అక్కడ కూడా స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకున్న ఆమెకు జాహ్నవి, ఖుషీ కపూర్ లు జన్మించారు. 

 

తన కూతురు జాహ్నవిని కూడా మంచి హీరోయిన్ గా తీర్చి దిద్దాలన్న తపనతో ఉన్న శ్రీదేవిని అనుకోకుండా మృత్యువు కబళించింది. తన కూతురుని హీరోయిన్ గా చూడకుండానే దుబాయ్ లో కన్ను మూసింది.  అయితే శ్రీదేవి చనిపోయిన తర్వాత జాహ్నవి నటించిన ‘ధడక్’ చిత్రం రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది.  ప్రస్తుతం జాహ్నవి బాలీవుడ్ లో అందాల తారగా పేరు తెచ్చుకుంది.  భవిష్యత్ లో ఆమె చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినీ రంగ ప్రవేశం చేస్తుందని వార్తలు వస్తున్నాయి.

 

తాజాగా శ్రీదేవి కుమార్తెలు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ తమ స్నేహితులతో కలిసి అలిపిరి మార్గంలో నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. వీరు కొండ ఎక్కి వచ్చేసరికి రాత్రి 11 గంటల సమయం అయింది.  అంతే కాదు చివరి మెట్టు వరకు నడిచి కర్పూరం వెలిగించి, తిరుమలలోకి ప్రవేశించిన వీరు, శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ లో బస చేసి, ఈ ఉదయం స్వామిని దర్శించుకున్నారు. ఇక శ్రీదేవి కూతుళ్లు ఇద్దరు తిరుమలకు స్వామి వారి దర్శనానికి వచ్చారని తెలుసుకున్న భక్తులు, అభిమానులు వారిని చూడటానికి వచ్చారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: