గత శుక్రు వారం విడుదలైన ‘జాను’ మూవీ సక్సస్ మీట్ ను నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు. వాస్తవానికి ఈ సినిమాకు టోటల్ పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా కలక్షన్స్ దిల్ రాజ్ ఊహించిన స్థాయిలో లేవు అన్న వార్తలు వస్తున్నాయి. 


అయితే ఈ విషయాలను లెక్క చేయకుండా నిన్న ధ్యేర్యంగా ఈ మూవీ సక్సస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఫంక్షన్ కు అతిధిగా వచ్చిన మహిళా దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఒక దర్శకురాలుగా హీరో శర్వానంద్ కు క్షమార్పణలు చెపుతున్నాను అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. 


శర్వానంద్ సమర్థతకు తగ్గ ఒక స్క్రిప్ట్ ను ఇప్పటి వరకు ఇండస్ట్రీలోని ఏ రచయిత అదేవిధంగా దర్శకుడు వ్రాయలేకపోయాడు అనీ అందువల్లనే శర్వానంద్ లోని నిజమైన నటుడు ఇప్పటి వరకు బయటకు రాలేదు అంటూ కామెంట్స్ చేసింది. ‘జాను’ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశాలు చూసి తన కంట కన్నీరు ఆగలేదు అంటూ నందినీ రెడ్డి భావోద్వేగానికి గురైంది. 


ఇదే సమావేశానికి మరొక అతిధిగా వచ్చిన రాఘవేంద్రరావు మాట్లాడుతూ మరొక షాకింగ్ కామెంట్ చేసాడు. తాను చదువుకునే రోజులలో చిన్న తనం నుండి డిగ్రీ వరకు అంతా అబ్బాయిలు ఉండే స్కూల్స్ కాలేజీలలో చదువుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తాను ‘జాను’ సినిమా చూసిన తరువాత తన చిన్న తనంలో అమ్మాయిలతో కలిసి ఉండే స్కూల్స్ కాలేజీలలో ఎందుకు చదువుకోలేదు అన్న ఫీలింగ్ కలిగింది అని అన్నాడు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత తన చుట్టూ చాల అందమైన అమ్మాయిలు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది అంటూ రాఘవేంద్రరావు వేసిన జోక్ నిన్నటి ఈవెంట్ కు హైలెట్ గా మారింది. ఈ మూవీకి ప్రశంసలు వస్తున్నా కలక్షన్స్ అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితులలో ‘జాను’ ఫలితం పై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: