తెలుగు బుల్లితెరపై ఎంతో మంది ఫిమేల్ యాంకర్లు వచ్చారు.. వస్తూనే ఉన్నారు.  అందులో కొంత మంది బాగా పాపులర్ అయ్యారు.  తెలుగు యాంకర్లు అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది సుమ కనకాల, ఉదయభాను, ఝాన్సీ, ఈ మద్య కాలంలో అనసూయ, రష్మ, శ్రీముఖి.   ఇక తెలుగు బుల్లితెరపై మెయిల్ యాంకర్లు కూడా బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నారు.  ఒకప్పుడు శివాజీ యాంకర్ గా చేసిన తర్వాత వెండితెరపై ఛాన్సులు దక్కించుకున్నాడు.  ఆ తర్వాత యాంకర్ ఓంకార్ సైతం మాంచి పాపులారిటీ తెచ్చుకొని దర్శకుడిగా మారారు.  ప్రదీప్ మాచినేని జీ తెలుగు లో వచ్చే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా తో బాగా పాపులర్ అయ్యాడు.  ఇక పటాస్ తో యాంకర్ రవి మంచి క్రేజ్ సంపాదించాడు.

 

యాంకర్లుగా చేస్తూనే వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. తాజాగా ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో సందీప్ తన దగ్గర రూ.45 లక్షలు అప్పు తీసుకుని మోసం చేశాడంటూ రవి  కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పు తీసుకున్న సందీప్ కొద్దిరోజుల్లోనే కొంత మొత్తాన్ని తిరిగిచ్చాడని, ఇంకా రూ.41లక్షలు ఇవ్వాల్సి ఉందని యాంకర్ రవి చెబుతున్నాడు.   యాంకర్ రవి హీరోగా 'ఇది మా ప్రేమ కథ' అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకి గాను సందీప్ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. కాకపోతే ఆ సినిమా ప్లాప్ అయింది.  తాను ఎక్కడికి వెళ్లినా తన మనుషులను పంపి నిఘా పెడుతున్నాడని, అతడి నుంచి తనకు రక్షణ కల్పించాలని రవి పోలీసులను కోరాడు.

 

తనలాగే చాలా మంది దగ్గర సందీప్ డబ్బులు తీసుకుని మోసం చేశాడని రవి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, అయితే, అప్పట్లో గుడ్ విల్ కింద డబ్బులు ఇచ్చిన యాంకర్ రవి మళ్లీ ఆ డబ్బులు తిరిగివ్వాలని గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి బెదిరిస్తున్నాడంటూ 2018 అక్టోబర్‌లో యాంకర్ రవి  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  ఇక తన దగ్గర తీసుకున్నట్లే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్న సందీప్ వారిని కూడా ఇలాగే మోసం చేశాడని నిన్న సాయంత్రం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు రవి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: