తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు రీల్ లైఫ్ లోేనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  తెలుగు లో అక్కినేని నాగార్జున-అమల, మహేష్ బాబు - నమ్రతా శిరోడ్కర్, అక్కినేని నాగ చైతన్య - సమంత, ఇలా ఎంతో మంది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  రామ్ చరణ్, అల్లు అర్జున్ సైతం ప్రేమించి అమ్మాయిలనే చేసుకున్నారు.  అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న కొంత మంది నటులు ఇప్పటి వరకు కలిసి ఉంటే కొంత మంది మాత్రం విడిపోయారు.  తాజాగా 15 సంవత్సరాల క్రితం మహేష్ బాబు - నమ్రత శీరోద్కర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  

 

ఈ జంటకు వివాహమై నేటికి 15 సంవత్సరాలు కాగా, నమ్రత, తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రతి అమ్మాయీ కనే కల లాంటి ప్రపంచం తన కళ్ల ముందుందని చెప్పింది.ప్రతి యువతీ కలలుగనే ఓ అద్భుతమైన ప్రపంచాన్ని నాకు అందించావు. నా జీవితమంతా నీ స్వచ్ఛమైన ప్రేమతో, ముద్దులొలికే మన ఇద్దరు పిల్లలతో నింపేశావు. నీ ప్రేమానురాగాలతో మన ఇల్లు ఎప్పుడూ నందనవనమే. నీ సాహచర్యం నాకెప్పుడూ ఉంటేచాలు. నాకు ఇంతకన్నా ఏం కావాలి?. నా ప్రియాతి ప్రియమైన మహేశ్‌ కు 15వ మ్యారేజ్ డే శుభాకాంక్షలు అంటూ నమ్రత తన ఇన్ స్ట్రా గామ్ లో పోస్ట్ చేసింది.  

ఇక మహేష్ బాబు  తన భార్య నమ్రతతో కలిసున్న ఓ చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పోస్ట్ చేయగా, అదిప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో మహేశ్, ఈ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు. క్షణాల్లోనే దీనికి వేలకొద్దీ లైక్స్, వందల కొద్దీ షేర్స్ వచ్చాయి. టాలీవుడ్ లో లవ్ లీ కపుల్ అని అందుకే అంటారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

U have given me the perfect life any girl could ever dream of... a life filled with unconditional love 💕 2 exquisite babies...a place we can proudly call our home and above all our friendship that I will treasure forever !! What more can I ask for ❤❤happy 15th MB😘😘love u for everything you are to me ❤❤ @urstrulymahesh 🤗

A post shared by namrata Shirodkar (@namratashirodkar) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: