సినీ పరిశ్రమలో ఎంతో మంది నటీ, నటుల వారసులు, వారసురాళ్లు హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.  కొంత మంది సక్సెస్ అయితే మరికొంత మంది కాలేకపోతున్నారు. ‘మా పల్లెలో గోపాలుడు, జెంటిల్‌మెన్, ఒకే ఒక్కడు, జైహింద్, పుట్టింటికి రా చెల్లి, హనుమాన్ జంక్షన్’ వంటి సినిమాల్లో హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిరమైన స్థానం పొందిన నటుడు అర్జున్.  ప్రస్తుతం ఆయన విలన్ గా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోల కూతుళ్లు హీరోయిన్లు గా రాణిస్తున్నారు.  రణధీర్ కపూర్ కూతుళ్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ లు నెంబర్ వన్ హీరోయిన్లుగా చలామణి అయ్యారు.  ఆ తర్వాత అనీల్ కపూర్, శత్రుఘ్న సిన్హా, శక్తి కపూర్ కూతుళ్లు హీరోయిన్లుగా పరిచయం అయి మంచి ఫామ్ లో కొనసాగారు..సాగుతున్నారు.

 

ఇక తెలుగు లో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా హీరోయిన్ గా పరిచయం కావాలనుకున్నప్పటికీ.. అది కుదరలేదు.  ప్రస్తుతం మంచు లక్ష్మి టివి యాంకర్, పలు సినిమాల్లో క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తుంది. అర్జున్ తన కూతురు ఐశ్వర్య అర్జున్ తెలుగు సిని పరిశ్రమలోకి ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు.   కాగా, అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్ పుట్టినరోజు నేడు (ఫిబ్రవరి 10) ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తన కూతురు తెలుగు సిని పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నట్లు విషయం చెప్పారు.

 

ఇప్పటికే కన్నడ, తమిళ భాషల్లో కథానాయికగా పరిచయం చేశారు. ఈ నేపథ్యంలో తన కూతురును తెలుగు తెరకి పరిచయం చేస్తానని చెప్పారు. తన దర్శకత్వంలోనే ఈ సినిమా ఉంటుందని అన్నారు. ఈ రోజున ఐశ్వర్య పుట్టినరోజు దృష్టిలో పెట్టుకొని తన కూతురు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైందనీ, అందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తానని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: