డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రొమాంటిక్. ఎప్పుడో షూటింగ్ ప్రారంభమైన సినిమా ఇప్పటికి పూర్తి కాలేదు దానికి కారణం రీ షూట్ లు చేయడమే.. ఇక తాజాగా ఈ సినిమా నుండి కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈహాట్ పోస్టర్ లో హీరో,హీరోయిన్ కిస్ చేసుకుంటూ కనిపించారు అలాగే ఈ పోస్టర్ లో రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. మే 29న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.
యూత్ ను టార్గెట్ చేస్తూ నూతన దర్శకుడు అనిల్ పడూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తుండగా సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ మరియు మకరంద్ దేశ్ పాండే ముఖ్య పాత్రల్లో కనిపించనుండగా కేతిక శర్మ , ఆకాష్ కు జోడిగా నటిస్తుంది. కాగా కేతిక శర్మకు ఇదే మొదటి సినిమా అయితే మొదటి సినిమాతోనే కేతిక బోల్డ్ గా నటిస్తూ రెచ్చిపోతుంది.
ఇక 2018లో
ఆకాష్ పూరిని హీరోగా పెట్టి పూరి జగన్నాథ్ 'మెహబూబా' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు అయితే ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది కానీ
ఆకాష్ నటన కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు 'రొమాంటిక్' తో ఎలాగైనా తన కొడుకును హీరోగా నిలబెట్టాలని పట్టుదలతో వున్నాడట పూరి. అందుకోసం
సినిమా కుఎంతైనా ఖర్చు చేస్తున్నాడట. అంతేకాదు ఈచిత్రానికి కథ , స్క్రీన్ ప్లే , మాటలు కూడా పూరి జగన్నాథే అందిస్తున్నాడు. ఇదిలావుంటే గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమైన
పూరి గత ఏడాది
ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి సత్తా చాటాడు. ప్రస్తుతం
పూరి, సెన్సేషనల్
హీరో విజయ్
దేవరకొండ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.