ముందుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అసిస్టెంట్ డైరెక్టర్ గా, కథా రచయితగా కొన్ని సినిమాలకు పనిచేసిన అనిల్ రావిపూడి, ఆ తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. అయితే తాను దర్శకత్వం వహించిన తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా రాశిఖన్నా హీరోయిన్ గా తెరకెక్కిన సుప్రీం అనే సినిమా తీసి మరొక హిట్ అందుకొని, ద్వితీయ విఘ్నాన్ని కూడా సునాయాసంగా దాటేశాడు. 

 

ఆపై మాస్ మహారాజా రవితేజ హీరోగా ఆయన తీసిన రాజా ది గ్రేట్, దాని అనంతరం విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల కలయికలో తెరకెక్కిన ఎఫ్ 2 అనే సినిమాలు కూడా తీసి మరొక రెండు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్. ఇక ఇటీవల సంక్రాంతికి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా తీసి వరుసగా మరొక హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ఒకరు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 

 

అయితే అనిల్ సినిమాలను మన కొంత పరిశీలిస్తే, ఆయన సినిమాల్లో మంచి కంటెంట్ తో పాటు ఆడియన్స్ ని అలరించే ఫన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ సీన్స్ వంటివి తప్పనిసరిగా ఉంటాయి. అలానే ఎఫ్ 2 సినిమాని మినహాయిస్తే దాదాపుగా ఆయన సినిమాల్లోని హీరోలు కామెడీ పండించడంతో పాటు, యాక్షన్, ఫైట్స్ వంటివి అదరగొట్టడం గమనించవచ్చు. ఇక అతి త్వరలో ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఎఫ్3 అనే సినిమాని తెరకెక్కించే ఆలోచనలో ఉన్న అనిల్ రావిపూడి, దానిని కూడా మంచి సక్సెస్ చేసేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: