దక్షిణాదిలో బాహుబలి తరువాత అదే స్థాయిలో సంచలనం సృష్టించిన మరో సినిమా కే జీ ఎఫ్. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శ్తకత్వంలో తెరకెక్కిన కే జీ ఎఫ్ కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వెల్ను మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
ఇన్నాళ్లు కన్నడ సినిమా అంటే ఇతర ఇండస్ట్రీలకు చిన్న చూపు ఉండేది. సాండల్వుడ్ సినిమాలు క్వాలిటీ పరంగా కంటెంట్ పరంగా అంతా ఎఫెక్టివ్గా ఉండవన్న అపవాదు కూడా ఉంది. అయితే ఆ అపవాదులన్నింటినీ చెరిపేసింది కే జీ ఎఫ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమాలో ఓ సీనియర్ తెలుగు యాక్టర్ కూడా నటించనున్నాడన్న విషయాన్ని వెల్లడించాడు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇటీవల విలక్షణ పాత్రలతో తెలుగులో బిజీ ఆర్టిస్ట్గా మారిన సీనియర్ నటుడు రావూ రమేష్ కే జీ ఎఫ్ 2లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా కే జీ ఎఫ్ 2 దర్శకుడితో రావూ రమేష్ మాట్లాడుతున్న ఫోటోను తన సోషల్ మీడియా పేజ్లో షేర్ చేసిన ప్రశాంత్ నీల్ `రావూ రమేష్ గారికి స్వాగతం, కే జీ ఎఫ్ 2లో భాగమైనందుకు కృతజ్ఞతలు` అంటూ ట్వీట్ చేశాడు.
యష్కు జోడిగా శ్రీనిథి శెట్టి నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టండన్, అనంత్ నాగ్, మాళవిక అవినాష్, అచ్యుతకుమార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా ఈ ఏడాది సమ్మర్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే నిర్మాణ కార్యక్రమాలు ఆలస్యం కావటంతో సినిమా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను జూలై నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Welcome on board rao ramesh sir.
— Prashanth Neel (@prashanth_neel) February 10, 2020
We will leave it to the audience to keep guessing on this one, till they see you on the big screen.
Thank you for being apart of #KGFChapter2 pic.twitter.com/fWteQ5YnHm