తెలుగు లో ఇప్పటి వరకు ఎంతో మంది హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే రమేష్ బాబు తర్వాత కాలంలో నిర్మాతగా మారారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పొజీషన్లో మహేష్ బాబు కొనసాగుతున్నారు. అయితే సూపర్ స్టార్ చిన్న అల్లుడు సుధీర్ బాబు సైతం హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ‘ఏం మాయ చేసావే’ చిత్రంలో సమంత సోదరుడిగా నటించిన సుధీర్ బాబు తర్వాత ఎస్ ఎంఎస్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. సుధీర్ బాబు ఆ తర్వాత ప్రేమకథా చిత్రమ్, భలే మంచి రోజు, శమంతకమణి, సమ్మోహనం చిత్రాలతో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ మద్య బాలీవుడ్ లో బాఘీ 2 చిత్రంలో నటించారు. కానీ ఈ మూవీ పెద్దగా కలిసి రాలేదు ఈ హీరోకి.. దాంతో మళ్లీ తెలుగు లోనే కంటిన్యూ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు సుధీర బాబు. ఆయన తనయుడు కూడా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మద్య సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ చిత్రంలో నటించాడు. ఆ మద్య సుధీర్ బాబు తన సుధీర్ బాబు తన విన్యాసాలతో నెటిజన్స్ని అలరిస్తున్నాడు. యోగాసనంతో గాల్లో తేలుతూ ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..ఇది నిజం ఎలాంటి గ్రాఫిక్ మాయ కాదని పేర్కొన్నారు. తాజాగా మరోసారి ఎమోషన్ ట్వీట్ పోస్ట్ చేశారు.
2012, ఫిబ్రవరి 10న ఆయన పూర్తిస్థాయి హీరోగా నటించిన తొలి చిత్రం 'ఎస్ఎమ్ఎస్-శివ మనసులో శ్రుతి' విడుదలైంది. ఆ తర్వాత ఆయన పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నానితో కలిసి 'వీ' అనే సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఇదే రోజు.. ఎనిమిదేళ్ల క్రితం... ఎస్ఎమ్ఎస్ విడుదలైంది. ఈ ప్రయాణాన్ని ప్రేమిస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇంకా నేర్చుకోవాలని, చిత్రాలపై మరింత ప్రేమ పెంచుకోవాలని భావిస్తున్నాను' అని సుధీర్ బాబు తెలిపాడు.
This day, 8 years ago .... #SMS happened. love this journey. Want to learn and love cinema more and more for decades ♥
— Sudheer Babu (@isudheerbabu) February 10, 2020