టాలీవుడ్ లో బెస్ట్ మ్యూజిషియన్స్ లో దేవిశ్రీ ప్రసాద్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. టాప్ హీరోలందరికీ ఒక దశలో చాయిస్ గా మారాడు. ఇటివల ఆయన చేసిన ఏ సినిమా ఆడియో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోతున్నాయి. రంగస్థలం తర్వాత దేవీకి హిట్ ఆల్బమ్ లేదు. ఇటివలి సరిలేరు నీకెవ్వరుకు కూడా పేలవమైన పాటలే ఇచ్చాడు. ప్రస్తుతం బన్నీసుకుమార్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు దేవీని తప్పించాలనే ప్రయత్నాలు జరగుతున్నాయని ఫిలింనగర్ లో టాక్ వినపడుతోంది.

 

 

సంక్రాంతికి బన్నీ అల వైకుంఠపురముతో సినిమాతో థమన్ చేసిన మ్యాజిక్ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించడంలో థమన్ పాటలు కీలకపాత్ర పోషించాయి. దీంతో సుక్కూతో సినిమాకు కూడా థమన్ నే ప్రపోజ్ చేస్తున్నాడట బన్నీ. అయితే.. దేవీతో తనకు ఉన్న మ్యాజిక్ గురించి.. వాళ్ల ఆల్బమ్స్ గురించి చెప్పి బన్నీని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దేవీ మ్యాజిక్ పై బన్నీకి ఇంకా నమ్మకం కుదరడంలేదని అంటున్నారు. థమన్ ఇప్పుడు బిజీగా మారిపోయాడు. ఏకంగా తొమ్మిది సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ దశలో బన్నీ సినిమా చేయగలడా.. దేవీనే ఉంచాలని బన్నీని సుక్కూ ఒప్పిస్తాడా అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ విషయంపై అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

 

 

ముఖ్యంగా 2012 నుంచి 2019 వరకూ దేవీశ్రీ ప్రసాద్ స్వర్ణయుగం అనే చెప్పాలి. అదే టైమ్ లో మణిశర్మ ఫామ్ కోల్పోవడం.. థమన్ రిపీటెడ్ ట్యూన్స్ తో వెనుకబడ్డారు. అవకాశాన్ని చక్కగా ఒడిసిపట్టుకున్న దేవీ స్టార్ హీరోలకు ఎలాంటి పాటలు ఇస్తే క్లిక్ అవుతాయో అవే ఇచ్చి టాప్ మ్యూజిషియన్ గా మారిపోయాడు., అలాంటి దేవిశ్రీ ప్రసాద్ కి ప్రస్తుతం టఫ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: