బాలీవుడ్ లో సీనియర్ అండ్ క్రేజీయస్ట్ హీరోయిన్ అంటే కరీనా కపూర్ పేరు తప్పకుండా వినిపిస్తుంది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న సమయంలోనే సైఫ్ ఆలీఖాన్ ను పెళ్లాడింది. పెళ్లై బిడ్డకు తల్లైనా కరీనా గ్లామర్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. ఇందుకు ఆమె చేస్తున్న సినిమాలు, ఫోటోషూట్ లే సమాధానం చెప్తాయి. రీసెంట్ గా ఆమె నటించిన గుడ్ న్యూస్ సినిమాలో కూడా ఆమె ఎంతో అందంగా కనిపించింది. ఇటివల ఓ మీడియా ఇంటరాక్షన్ లో ఆమె టాలీవుడ్ పై తనకున్న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.

 

 

‘రీజనల్ లాంగ్వేజెస్ లో తెలుగు సినిమాలపై నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. దక్షిణాదిలో ఏ భాషా నాకు రాదు. అందులో తెలుగులో కూడా ఉంది. అందుకే అక్కడ సినిమాలు చేయాలని ఉన్నా ఇప్పటి వరకూ అటెంప్ట్ చేయలేదు. ఒకవేళ అక్కడ సినిమా చేయాలని అవకాశం వస్తే మాత్రం.. మహేశ్, రామ్ చరణ్, ప్రభాస్ లతో సినిమాలు చేయాలని ఉంది. నటీనటులకు మంచి గౌరవమిచ్చే అటువంటి ఇండస్ట్రీలో పని చేయాలని ఉంది’ అని తన మనసులోని మాటను చెప్పుకొచ్చింది. దీంతో ఆమెకు తెలుగులో సినిమాలు చేయాలనే కోరిక ఉందని అర్ధమైంది. తెలుగు సినిమాల మార్కెట్, తెరకెక్కుతున్న విధానం, కలెక్షన్లు సృష్టిస్తున్న తీరు పలు బాలీవుడ్ తారలను తెలుగు సినిమాల గురించి ఆలోచించేలా చేస్తున్నాయని అర్ధమవుతోంది.

 

 

ఇందుకు బాహుబలి సిరీస్ సినిమాలు, సాహో, సైరా.. సినిమాలే ఉదాహరణ. పాన్ ఇండియా కథలతో తెలుగు సినిమాలు ఇండియా మొత్తం ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయో కరీనా మాటలతోనే తెలుస్తోంది. బాలీవుడ్ లో బెబో అనే ముద్దు పేరున్న కరీనాకు టాలీవుడ్ లో మనవాళ్లు అవకాశం ఇస్తారేమో చూడాలి. మరి.. బెబో తెలుగు సినిమా కోరికను మహేశ్, రామ్ చరణ్, ప్రభాస్ తీరుస్తారేమో చూడాలి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: