అక్కినేని సమంత, శర్వానంద్ ల కలయికలో తెరకెక్కిన తాజా సినిమా జాను. యువ దర్శకుడు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ని సంపాదించింది. రెండేళ్ల క్రితం తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన 96 అనే మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష హీరో, హీరోయిన్లుగా నటించగా ఈ ఒరిజినల్ వర్షన్ కు కూడా సి ప్రేమ్ కుమారే దర్శకత్వం వహించడం జరిగింది. ఇక తెలుగులో ఈ సినిమా రీమేక్ చేస్తే మంచి సక్సెస్ సాదిస్తుందని భావించి, నిర్మాత దిల్ రాజు ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసి సమంత, శర్వా లతో దీనిని రీమేక్ చేసారు. 
 
 
ఇక తమిళ్ వర్షన్ 96 మాదిరిగా జాను సినిమాలో కూడా సమంత, శర్వా తమ ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ లతో ప్రేక్షకులను ఎంతో కట్టిపడేసారు. హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా కథ, కథనాలు ఆకట్టుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కొంత ల్యాగ్ ఉందని కొద్దిపాటి విమర్శలు వచ్చాయి. కాగా అది పెద్ద పట్టింపు కాదని, క్లైమాక్స్ సీన్స్ తో పాటు ముఖ్యమైన కొన్ని సీన్స్ సినిమాకు ప్రధాన బలం అని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు కొందరు సినిమా నటులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
 
ఇకపోతే నేడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తన సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా స్పందిస్తూ, జాను చాలా మంచి సినిమా అని, ఇటువంటి రీమేక్ ని తీసి హిట్ కొట్టడం అంత సులువైన విషయం కాదని, హీరో శర్వాకు అలానే హీరోయిన్ సమంత లతో పాటు దర్శకుడు ప్రేమ్, నిర్మాత దిల్ రాజుకు తన తరపున సినిమా సక్సెస్ పై ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు చరణ్ ఒక పోస్ట్ చేసారు. కాగా చరణ్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!! 
 

మరింత సమాచారం తెలుసుకోండి: