ఒక పక్క రాజకీయాలు చేస్తూ మరోపక్క సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇటీవల దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. దీంతో వరుసగా మూడు సినిమాలు ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ వాటికి సంబంధించిన షూటింగ్లో బిజీగా ఉన్నారు. అందులో పింక్ రీమేక్‌ ఒకటి కాగా.. క్రిష్ దర్శకత్వంలో మరొకటి. చారిత్రాత్మక చిత్రంగా క్రిష్ మూవీ తెరకెక్కుతుండగా.. పండుగ సాయన్న పాత్రలో పవన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వానీని సంప్రదించిందట చిత్ర యూనిట్. అయితే పవన్ కళ్యాణ్ ఆఫర్ కి హీరోయిన్ కియారా అద్వానీ హ్యాండ్ ఇచ్చిందట...చేయనని చెప్పేసిందట.

 

ఇదే తరుణంలో గతంలో మహేష్ బాబు మరియు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన భరత్ అనే నేను సినిమాలో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వడం తో తాజాగా మరొకసారి మహేష్ బాబు తో నటించే ఛాన్స్ రావటంతో దానికి కియారా అద్వానీ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తలకట్టు పోయే సినిమా అని ఫిలిం నగర్ టాక్. అంతేకాకుండా విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్ సినిమాలకు కూడా కియారా నో చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఆసక్తికరంగా మహేష్ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

 

దీంతో అందరి హీరోలకి నో చెప్పడం మరియు మహేష్ సినిమాకి ఓకే చెప్పడంతో కియారా అద్వానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఒకపక్క బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ ఈ ముద్దుగుమ్మ సౌత్ లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో వెళ్లిన సందర్భంలో కియారా అద్వానీ టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలేసినట్లు వార్తలు గట్టిగా రాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో..వచ్చిన ఈ వార్తలకు క్లారిటీ ఇస్తూ సౌత్ ఇండస్ట్రీని వదిలే ప్రసక్తే లేదని కనీసం ఒక్క సినిమా అయినా ఏడాదికి చేస్తానంటూ మాట ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: