బుల్లితెర టాప్ యాంకర్ అనసూయ జబర్దస్త్ షోతో ఎంత ఫేమస్ అయిందో సోషల్ మీడియాలో కూడా అంతే ఫేమస్ అయింది. అనసూయను టార్గెట్ చేస్తూ పలువురు ఆకతాయిలు చేసే చేష్టలకు ఘాటుగానే రిప్లై ఇస్తూ వారిని ఎదుర్కొంటూ ఉంటుంది. తాజాగా అనసూయ మీద నాగార్జునను కలిపి ఓ ట్విట్టర్ అకౌంట్ లో చేసిన మెసేజెస్ ఆమెను తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. చాలా జుగుప్సాకరంగా ఉన్న ఆ మెసేజెస్ పై ఆమె ట్విట్టర్ యాజమాన్యానికి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

 

యాక్టర్స్ మసాలా అనే ట్విట్టర్ అకౌంట్ లో అనసూయపై చాలా వల్గర్ కామెంట్స్ చేశారు. అవే ట్వీట్లను అనసూయ స్క్రీన్ షాట్స్ గా తీసి వీరిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ నిర్వాహకులను కోరింది. వారు కూడా ఈ ప్లాట్ ఫాంలో ఈ పోస్ట్ లు  తప్పేం కాదన్నట్టు రియాక్ట్ అయ్యారు. దీంతో మరింత కోపంతో.. అయితే మీ రూల్స్ మార్చుకోండి. ఇలాంటి అసభ్య పదాలను కరెక్ట్ అనడం తగదు అని మళ్లీ రిప్లై ఇచ్చింది. వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైం పోలీసులకు ట్యాగ్ చేసింది అనసూయ. ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైం ఏసీపీ ప్రసాద్ విచారణ జరిపిస్తామన్నారు. కానీ.. కోర్టుకు వివరాలు సబ్ మిట్ చేసేందుకు సంతకంతో కూడిన లిఖితపూర్వక ఫిర్యాదు ఇవ్వాలని అనసూయను కోరారు.

 

 

సెలబ్రిటీల మీద ఇటువంటి కామెంట్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు వారికి థ్యాంక్స్ కూడా చెప్పింది. ప్రస్తుతం ఆ అకౌంట్ డీయాక్టివేట్ అయింది. అయితే.. నెటిజన్లు మాత్రం అనసూయను అనవసరంగా విషయం పెద్దది చేసుకోవడం వల్ల ఉపయోగం లేదని అంటున్నారు. ఇలాంటి వారిని ఇక్కడే ఖండించకపోతే భవిష్యత్తులో రేపిస్టులు అవుతారని అనసూయ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: