సౌత్ సిని పరిశ్రమలోనే కాదు.. నేషనల్ వైడ్ గా రాజమౌళిని బీట్ చేసే డైరక్టర్ లేడని చెప్పాలి. ఒకప్పుడు ప్రాంతీయ సినిమాగా 50 కోట్ల షేర్ కూడా తీసుకురాలేని తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడేలా చేశాడు రాజమౌళి. ఇక ఆయన్ను ఫాలో అవుతూనే సత్తా చాటుతున్న దర్శకులు కొందరు ఉన్నారు.

 

అలాంటి వారి గురించి చెప్పాలంటే కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ వస్తాడు. కన్నడ పరిశ్రమలో 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటేనే అదో సెన్సేషన్ అలాంటిది kgf పార్ట్ 2 ఏకంగా 250 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన kgf సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా రిలీజైన అన్ని భాషల్లో క్రేజీ హిట్ అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వల్ తెరకెక్కుతుంది.

 

ఈ సీక్వల్ కు రాజమౌళి స్ట్రేటజీ ఫాలో అవుతున్నాడు kgf డైరెక్టర్ ప్రశాంత్ నీల్. చాప్టర్ 2 షూటింగ్ ఎప్పుడో మొదలవగా ఈ సినిమాలో నటిస్తున్న ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తూ కొత్తగా పబ్లిసిటీ చేస్తున్నాడు. సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్, శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రలు చేస్తున్నారు. లేటెస్ట్ గా సినిమా లో రవీనా టాండన్ రమిక సేన్ అనే పాత్రలో కనిపిస్తుందట. రవీనా టాండన్ తో దిగిన పిక్ షేర్ చేసి సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.

 

ఈ ప్రమోషన్ ప్రాసెస్ చూస్తుంటే రాజమౌళి బాహుబలి గుర్తుకు తెస్తుంది. మరి ఇండైరెక్ట్ గా KGF-2 తో బాహుబలిని టార్గెట్ చేశారని తెలుస్తుంది. సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో యష్ సూపర్ క్రేజ్ తెచ్చుకోగా ఈ సీక్వల్ తో మరోసారి తన సత్తా చాటేలా ఉన్నాడు. KGF-2 చాలా పెద్ద ప్లాన్ వేశాడని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: