పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడని చెప్పినప్పటి నుండి వస్తున్న వార్తలు అన్నీ ఇన్నీ కావు. పవన్ సినిమా ఇంకా ఎవరితో అన్న విషయం బయటకి రాకముందే..వారితో చేస్తున్నాడు..వీరితో చేస్తున్నాడు అంటూ పుకార్లు చెలరేగాయి. మొత్తానికి పవన్ తన సినిమాలని ఎవరెవరితో చేస్తున్నాడనే కన్ఫర్మ్ అయింది. తన రీ ఎంట్రీ సినిమాగా బాలీవుడ్ రీమేక్ ని ఎంచుకున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా వేణు శ్రీరామ్  దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

 

ప్రస్తుతం ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ క్రిష్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పతికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి.  పవన్ కళ్యాణ్ డేట్లు కూడా ఇచ్చేశాడు. కేవలం లాంఛనంగా ప్రారంభం కావడమే ఆలస్యం.. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో  రోజుకో వార్త వస్తుంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ఎవరు నటిస్తున్నారనే దాని మీద విపరీతంగా చర్చ నడుస్తుంది.

 

 


"కంచ్" ఫేమ్ ప్రగ్యా జైశ్వాల్ కి ఈ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందని సమాచారం. ప్రగ్యా జైశ్వాల్ కి కంచె తర్వాత చెప్పుకునేంత విజయాలేమీ రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో నటిస్తున్నానని తెలియగానే ఆమె ఆనందానికి అవధులు లేవట. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదని సమాచారం. ఎందుకంటే పవన్ క్రిష్ కాంబో సినిమాలో ఆమె నటించడం నిజమే.. కానీ మెయిన్ లీడ్ గా కాదట. సెకండ్ హీరోయిన్ గా ప్రగ్యాని తీసుకుని మెయిన్ లీడ్ ని వెతికే పనిలో పడ్డారట.

 

క్రిష్ తో ఉన్న స్నేహం కారణంగా ప్రగ్యాకి మెయిన్ లీడ్ వస్తుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది. మరి సెకండ్ హీరోయిన్ గా నైనా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందేమో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: