గుడిలో బడిలో మడిలో ఒడిలో అంటూ గతంలో తన సెక్సీ ఫిగర్ తో పాటు అద్భుతమైన డాన్స్ చేసి తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది పూజా హెగ్డే. మళ్లీ ఇటీవల బుట్ట బొమ్మ అనే సాంగ్ లో బ్రహ్మాండంగా కనిపించి ఇంకా తన ముచ్చటైన నాట్యంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే యొక్క క్రేజ్ ఎంతలా పెరిగిపోయింది అంటే... బాలీవుడ్ కండలవీరుడుు సల్మాన్ ఖాన్ ఆమెపై మనసు పారేసుకున్నాడట. అందుకే తన తదుపరి సినిమాలో పూజా హెగ్డే సరసన నటించేందుకు తెగ ఆశ పడుతున్నాడట.


సాధారణంగా బాలీవుడ్ బడా హీరోల పక్కన నటించే అవకాశం రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. అది కూడా సల్మాన్ ఖాన్ లాంటి ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నటుడితో రొమాన్స్ చేసేందుకు అవకాశం దొరికిందంటే అది చెప్పుకోదగ్గ విషయమే. వాస్తవానికి పూజా హెగ్డే ఈ అవకాశాన్ని తెలుగు సినిమా వలన చేజిక్కించుకుందని ఓ రకంగా చెప్పుకోవచ్చు.


గతంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన హౌస్ ఫుల్ 4 సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించిన పూజ హెగ్డే అద్భుతమైన నటనను ప్రదర్శించిందని ఆ చిత్ర బృందం ఆమెను బాగా కొనియాడింది. అందుకే సల్మాన్ ఖాన్ తో వారు తెరకెక్కిస్తున్న తమ నెక్స్ట్ 'కభీ ఈద్ కభీ దీవాలి' సినిమాలో పూజా హెగ్డే ని కథానాయికగా ఎంపిక చేశారు. ఎలాగూ సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే సరసన నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు కాబట్టి ఈమెను హౌస్ ఫుల్ 4 ఫిలిం మేకర్స్ ఎంపిక చేశారని ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తోంది. ఈ సల్మాన్ ఖాన్ చిత్రం ఒక స్వచ్ఛమైన ప్రేమ నేపథ్యంలో తెరకెక్కనుంది. అయితే హీరోయిన్ పాత్ర పోషించడానికి పూజా హెగ్డే కరెక్ట్ అని... మన తెలుగు సినిమాలు చూసిన తర్వాత తెలిసిందని హౌస్ ఫుల్ 4 నిర్మాత మీడియా సమావేశంలో చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: