బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫ్యాషన్ వరల్డ్ కి కొత్త అందాలు అద్దుతోంది. చిట్టిపొట్టి డ్రస్సులతో ట్రెండ్ సెట్ చేస్తోంది. చేసింది ఒక్క సినిమానే అయినా ఎప్పటికప్పుడు సెంట్రాఫ్ అంట్రాక్షన్ గా నిలుస్తోంది. ఆఫ్ స్క్రీన్ గ్లామర్ షో జాన్వీ బీటౌన్ లో క్రేజ్ పెంచుకుంటోంది. 


బీటౌన్ గ్లామర్ అండ్ గ్లిజ్ ప్రపంచంలో ఉన్న కాంపిటీషన్ ను దృష్టిలో పెట్టుకొని నేటితరం స్టార్ కిడ్స్ తెలివైన మంత్రాంగమే నడిపిస్తున్నారు. అలాంటి వాళ్లలో అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ముందు వరుసలో ఉంటోంది. నిరంతరం ఏదో ఒక విజువల్ ట్రీట్ ఇస్తూ నేటిజెన్లని తనవైపు తిప్పిసుకుంటోంది. ఇప్పిటికే ఇన్ స్టాగ్రామ్ లో జాన్వీకి అసాధారణ ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకాఇంకా ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. 

 

జాన్వీ కపూర్ నటించింది ఒక్క సినిమానే అయినా ఈ బ్యూటీ ఫాలోయింగ్ మాత్రం ఆశ్చర్యపరుస్తోంది. తొలి సినిమా ధఢక్ లో నటించేటపుడు కెమెరాకు ఫోజులివ్వాలంటనే ముడుచుకుపోయిన జాన్వీ ఇప్పుడు నిత్యం చిట్టిపొట్టి డ్రస్సుల్లో ముంబై కుర్రాళ్లకు గ్లామర్ విందు ఇస్తోంది. వీధుల్లో వెళ్లినా, జిమ్ముకి వెళ్లినా, మార్కెట్ కు వెళ్లినా ఈ బ్యూటీ వేసుకునే డ్రస్సులో ఇప్పడు హాట్ టాపిక్. 

 

చిట్టిపొట్టి నిక్కర్లతో జాన్వీ కపూర్ ఇచ్చే ట్రీట్ కు బాలీవుడ్ యూత్ ఫిదా అవుతోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో కుర్రకారు మతులు పోగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూనిక్కరు, వైట్ టాప్ లో టాప్ లేపేసింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉంది. కార్గిల్ గర్ల్, గుంజన్ సక్సేనా సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. భారీ హిస్టారికల్ తక్త్ తో పాటు దోస్తానా 2సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మొత్తానికి శ్రీదేవి కూతురు తన అందాలతో కుర్రకారు మతిపోగొడుతోంది. యూత్ నంతా తనవైపు తిప్పేసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: