ఖైదీ నంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తరువాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. అయితే సైరాకు మంచి టాక్ వచ్చిన వసూళ్ల పరంగా నిరాశపరచటంతో ఈ సారి ఓ కమర్షియల్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే మెసేజ్ ఓరియంటెడ్ కథలను కమర్షియల్ జానర్లో తెరకెక్కించే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చిరు.
ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా త్రిష నటిస్తోంది. గతంలో వీరిద్దరు స్టాలిస్ సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుఢ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
అయితే ఈ సినిమాలో చరణ్ చేయబోయేది నక్సలైట్ పాత్ర అన్న ప్రచారం జరుగుతోంది. దేవాదాయ శాఖలో జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు పాత్రలో కూడా రెండు షేడ్స్ ఉంటాయాన్న టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ సినిమాలో చరణ్ కనిపించటం దాదాపు కన్ఫార్మ్ అన్న టాక్ వినిపిస్తోంది.
చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావటంతో పూర్తిగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు చరణ్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడిగా నటిస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతుండగానే ఆచార్య షూటింగ్లోనూ చరణ్ పాల్గొంటాడేమో చూడాలి.