తెలుగు ఇండస్ట్రీలోకి సూపర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన అనుష్క ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించింది.  తెలుగు, తమిళంలో నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లిన ఈ అమ్మడు గత కొంత కాలంగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`.హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక బాహుబలి, బాహుబలి చిత్రాల తర్వాత కొంత గ్యాప్ తీసుకొని అనుష్క భాగమతి చిత్రంలో నటించింది.  ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. 

 

ఆ వెంటనే గౌతమ్ మీనన్ చిత్రంలో నటిస్తుందని వార్తలు వచ్చాయి.. కానీ అది సెట్స్ పైకి రాలేదు.  ఇక థ్రిల్లర్ నేపథ్యంలోనే మరోసారి ప్రేక్షకుల ముందుకు రావాలని అనుష్క చూస్తుంది.  ఈ నేపథ్యంలో నిశ్శబ్దం చిత్రంతో రాబోతుంది.  ఇప్పటికే  ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో  విడుద‌ల చేస్తున్నారు.
ఈ క్రాస్ జోన‌ర్ చిత్రంలో సాక్షి అనే డిఫ‌రెంట్ పాత్ర‌లో అనుష్క మెప్పించ‌నున్నారు.

 

అలాగే మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజ్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల , మైకేల్  త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ పాత్ర‌ల లుక్స్‌తో పాటు ఇటీవల విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను పెంచింది. మరి ఈ బొమ్మాళి నిశ్శబ్ధంగా థియేటర్లో ప్రేక్షకులను ఎంత వరకు ఎంట్రటైన్ చేస్తుందో చూడాలి,

మరింత సమాచారం తెలుసుకోండి: