మెగాస్టార్ ఫ్యామిలీ నుండి మరో వారసుడిగా వస్తోన్న హీరో "పంజా వైష్ణవ్ తేజ్". హీరో "సాయి తేజ్" తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న వైష్ణవ్ తేజ్ తన డెబ్యూ సినిమాగా కాస్త వెరైటీ కథనే ఎంచుకున్నాడు. జాలర్ల కథా నేపధ్యంగా "ఉప్పెన" సినిమాకు ఆయనికి కమిటయ్యాడు అప్ కమింగ్ హీరో వైష్ణవ్ తేజ్. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడైన సనా బుచ్చిబాబు సినీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

 

 

డైరెక్టర్ సుకుమార్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను చేయబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం చివరి దశకు చేరుకుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను కూడా మొదలు పెట్టారు. ఈ సినిమాకి గాను ప్రీ లుక్ లో, ఫస్ట్ గ్లిమ్స్ లో అసలు ఎక్కడా వైష్ణవ్ తేజ్ ను చూపించకుండా జాగ్రత్త పడ్డారు మూవీ మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి  పెంచుతోంది.

 

 

షూటింగ్ ని త్వరగా పూర్తి చేసి ఏప్రిల్ 2 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. నిర్మాతలు ఎప్పుడైతే ఈ డేట్ ను ప్రకటించారో కానీ, పాపం ఈ మెగా హీరోకి అసలు మనశ్శాంతి అనేది లేకుండా పోయిందంట. దీనికి కారణం ఇప్పుడు మరో రెండు భారీ సినిమాలు అదే తేదిని కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇప్పటికే అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన నిశ్శబ్దం ఎన్నో సార్లు వాయిదా పడి చివరికి ఏప్రిల్ 2న విడుదల కానున్నట్లు ఈ మధ్యే ఆ సినిమా నిర్మాతలు ప్రకటించారు.

 

 

దీనితో పాటు ఈ పోటీ సరిపోదన్నట్లు ఇప్పుడు రానా కూడా లైన్లోకి వచ్చాడు. ఎప్పటినుండో విడుదల కాకుండా ఆగిపోయిన ఆయన నటించిన ప్యాన్ ఇండియా చిత్రం "హాథీ మేరీ సాథీ", అనే సినిమాని తెలుగులో అరణ్య పేరుతో ఏప్రిల్ 2న విడుదల కానున్నట్లు ఆ సినిమా వర్గాలవాళ్లు ప్రకటించారు. "ఉప్పెన" సినిమాతో పోల్చుకుంటే ఈ రెండు సినిమాల స్థాయి కూడా చెప్పుకోదగినవే. అలాగే "ఉప్పెన" ఈ రెండు పెద్ద చిత్రాల పోటీని ఏ మేరకు తట్టుకుంటుందో వేచి చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: