అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో కెరీర్‌లోనే తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ స‌ర్కిల్స్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అల వైకుంఠ‌పుర‌ములో సినిమా నాన్ బాహుబ‌లి సినిమా రికార్డుల‌కు పాత‌రేసేసింది. ఇక త్రివిక్ర‌మ్ నెక్ట్స్ ప్రాజెక్టు టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తోనే ఉంటుంద‌ని టాక్‌..!

 

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ మే నుండి త్రివిక్రమ్ కు డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఆర్.ఆర్.ఆర్ వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎనౌన్స్ మెంట్ వ‌చ్చేసింది. వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీన ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇక ఎన్టీఆర్ త‌న‌కు డేట్లు ఇచ్చే టైంకు ముందుగానే త్రివిక్ర‌మ్ ఈ సినిమా స్క్రిఫ్ట్ వ‌ర్క్ కంప్లీట్ చేయాల‌ను కుంటున్నాడ‌ట‌.

 

ఇక ఈ సినిమాతో త్రివిక్ర‌మ్ చంద్ర‌బాబును టార్గెట్ చేయిస్తాడ‌న్న టాక్ వ‌స్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజ‌కీయ నాయ‌కుడిగా అందులోనూ మంత్రిగా క‌నిపిస్తాడ‌ట‌. భరత్ అనే నేను.. లీడర్ తరహాలో అనూహ్యంగా హీరో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడట. స్టోరీ లైన్ రాజ‌కీయాల‌ను బేస్ చేసుకుని ఉండ‌డంతో ఇటు సినిమా వ‌ర్గాలు, అటు నంద‌మూరి అభిమానులు, ఇటు ఏపీ రాజ‌కీయాల్లోనూ ఈ సినిమాపై ఆస‌క్తి ఉంది.

 

ఎన్టీఆర్ భ‌విష్య‌త్తులో టీడీపీ ప‌గ్గాలు చేప‌డ‌తాడ‌ని నంద‌మూరి అభిమానులు ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ ను రాజ‌కీయ నాయ‌కుడిగా... అందులోనూ మంత్రిగా చూపించ‌డం అంటే ఆ క‌థ ఎలా ఉన్నా ప‌రోక్షంగా చంద్ర‌బాబు, లోకేష్ ను టార్గెట్‌గా చేసిన‌ట్లువుతుంద‌ని కొంద‌రు చ‌ర్చిస్తున్నారు. ఇక ఈ సినిమా త్రివిక్రమ్ హోం బ్యానర్ గా చెప్పుకునే హాసిన హారిక బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది. వచ్చే సమ్మర్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: