చిన్న సినిమాలతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొని తరువాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో దాదాపు టాప్‌ స్టార్స్‌ అందరితో నటించిన ఈ బ్యూటీ తరువాత ఫాం కోల్పోయింది. అవకాశాలు తగ్గటంతో సీనియర్‌ హీరోల సరసన నటించేందుకు సై అన్నా పెద్దగా వర్క్‌ అవుట్ కాలేదు. ఎన్టీఆర్‌ బయోపిక్‌, మన్మధుడు 2 లాంటి సినిమాలు కూడా ఈ భామకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి.

 

అదే సమయంలో బాలీవుడ్లో అవకాశాలు రావటంతో ఉత్తరాది మీద దృష్టి పెట్టింది రకుల్‌. అయితే అక్కడ కూడా ఒకటి రెండు అవకాశాలు వచ్చిన బిజీ హీరోయిన్‌ అనిపించుకోలేకపోయింది. దీంతో రకుల్‌ కెరీర్‌ ప్రస్తుతం కష్టాల్లో పడింది. అయితే సినిమాలో పెద్దగా చేతిలో లేకపోయినా ప్రైవేట్‌ ఫంక్షన్లలో తళుక్కుమంటూ అభిమానులను అలరిస్తోంది ఈ భామ.

 

ఇటీవల మీడియాతో మాట్లాడిన ఈ భామ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తన కెరీర్‌లో చాలా హిట్ సినిమాలు ఉన్నా అదే స్థాయిలో ఫ్లాప్‌లు కూడా ఉన్నాయని ఒప్పుకుంది. అదే సమయంలో తాను చేయాల్సి కొన్ని సినిమాలో చేజారి ఇతర హీరోయిన్ల ఎకౌంట్‌లోకి వెళ్లాయని తెలిపిన రకుల్ ఆ విషయంలో తాను పెద్దగా బాధపడటం లేదని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్లపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 

`దక్షిణాదిలో హీరోల రెమ్యూనరేషన్‌ హీరోల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ విషయంలో ఇక్కడి దర్శక నిర్మాతలను తప్పు పట్టాడానికి లేదు. ఎందుకంటే దక్షిణాది అభిమానులు కేవలం హీరోలను చూసేందుకు థియేటర్లకు వస్తారు. అందుకే వారి భారీ పారితోషికం ఇవ్వటం తప్పుకాదు` అటూ కామెంట్ చేసింది. సాధారణంగా బాలీవుడ్‌ బాట పట్టిన దక్షిణాది హీరోయిన్లు సౌత్‌ సినిమాను చిన్న చూపు చూస్తారు. కానీ రకుల్ మాత్రం ఇప్పటికే సౌత్‌ సినిమాను తనకు ఇంపార్టెంట్‌ అంటూ అందరి మననసులు గెలుచుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: