దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో ‘బాహుబలి’ సినిమా తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దమ్ము ఏంటో తెలిసింది. అయితే ఆ తర్వాత అదే స్థాయిలో దేశవ్యాప్తంగా ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్ లో అలరించిన సినిమా కేజీఎఫ్. కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా 210 కోట్లు వసూళ్లు రాబట్టింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కన్నడంలో సూపర్ డూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రిలీజ్ అయ్యి అదే రేంజ్ లో హిట్ కొట్టింది. దీంతో ప్రస్తుతం కే జి ఎఫ్ 2 తెరకెక్కుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమా కంటే కే జి ఎఫ్ 2 సినిమాని చాలా పవర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం.
దీంతో సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్లను తీసుకున్న ప్రశాంత్ నీల్ సినిమాలో చాలా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సీన్ లా కోసం తెలుగు స్టార్ నటుడు రావు రమేష్ను కూడా నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికోసం రావు రమేష్ తో చర్చలు కూడా జరిపినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇదే విషయాన్ని తెలియజేసి రమేష్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అందుతున్న సమాచారం ప్రకారం ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలో హీరో యశ్ ను రావు రమేష్ కాపాడే సన్నివేశం సినిమాకి హైలెట్ అన్నట్టు టాక్. అంతేకాకుండా ఫస్ట్ పార్ట్ లో యశ్ క్యారెక్టర్ కి యాటిట్యూడ్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడం జరిగింది. కాగా ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సెకండ్ పార్ట్ లో మొదటిదాని కంటే చాలా పవర్ఫుల్ పాత్రలో యశ్ క్యారెక్టర్ ఉండబోతుందట. అంతేకాకుండా సినిమాలో చాలా పవర్ ఫుల్ విలన్స్ను ప్రశాంత్ నీల్ ఉండేటట్లు చూసుకుంటున్నారట.