పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఒక లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్, మల్లేశం ఫేమ్ అనన్య ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కిన కోర్ట్ డ్రామా మూవీ పింక్ మంచి విజయం సాధించడంతో దిల్ రాజు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసి, దీనిని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో కలిసి నిర్మిస్తున్నారు. 

 

ఇకపోతే ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా యొక్క ముహూర్తం కూడా ఇటీవల జరిగింది. పవన్ కళ్యాణ్ ఒక గజదొంగ గా నటించనున్న ఈ సినిమా ని పాన్ ఇండియా ఫీల్ తో పీరియాడికల్ డ్రామా గా దర్శకుడు క్రిష్ దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎమ్ రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఇక దీని తరువాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాని దర్శకుడు హరీష్ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు. 

 

ఇకపోతే ఈ సినిమాల తరువాత పవన్ నటించబోయే మరొక సినిమా కూడా నేడు ఖరారైనట్లు టాలీవుడ్ వర్గాల టాక్. రెండేళ్ల క్రితం పవన్ తో అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ మూవీ ని అందించి, ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమా తీసి మంచి హిట్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరొక్కసారి హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ పై పవన్ సినిమా చేయనున్నారట. నేడు పవన్ ని ప్రత్యేకంగా కలిసిన త్రివిక్రమ్, ఒక మంచి కథ చెప్పడం, అది నచ్చిన పవన్, హరీష్ శంకర్ సినిమా తరువాత మీ సినిమా చేస్తాను అని మాటివ్వడం జరిగిందట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: