మెగాస్టార్ చిరంజీవి మూడేళ్ళ క్రితం వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా తో టాలీవుడ్ కి నటుడిగా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఆ సినిమాని నిర్మించడం, అది మంచి హిట్ కొట్టడం జరిగింది. ఇక దాని తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, సైరా నరసింహారెడ్డి అనే సినిమాలో నటించారు. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇక దాని అనంతరం ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న 152వ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

 

ఒక మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ తో ఆకట్టుకునే కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఇటీవల మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఆడియో ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన మెగాస్టార్, సరిలేరు మాదిరిగా తమ సినిమా కూడా కేవలం 100 రోజుల్లో పూర్తి చేసేలా కొరటాలకు డెడ్ లైన్ పెట్టారు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవల వార్తలు ప్రచారం అయ్యాయి.

 

అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తుంటే, అసలు ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేదని, 
ఏకంగా వచ్చే ఏడాది వేసవిలోనే రిలీజ్ అవుతుందని అంటున్నారు. నిజానికి ముందుగా దీపావళికి అనుకున్న ఈ సినిమాని, ఆ తరువాత రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకున్నారట. అయితే సడన్ గా ఆర్ఆర్ఆర్ మూవీ ని అదే సమయంలో రిలీజ్ చేస్తున్నట్లు రాజమౌళి ఇటీవల ప్రకటించడంతో మెగా మూవీ చిక్కుల్లో పడిందని, కావున తమ సినిమాని వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ చేయాలి భావిస్తున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే ఇది ఒకరకంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కి చేదు వార్తే అని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: