టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా ఎంతో భారీ ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కలెక్షన్స్ సాధించి అద్భుత విజయాన్ని ఈ సినిమా దక్కించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో తొలిసారిగా మిలటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో నటించిన ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, 

 

ప్రొఫెసర్ భారతి అనే ముఖ్యమైన పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించి మెప్పించారు. ఆకట్టుకునే కథాంశంతో పూర్తిస్థాయి కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం కూడా ఎంతో అలరించింది. ఇక సంక్రాంతి సీజన్ వల్ల వరుస సెలవులు రావడంతో సినిమాకు మరింత బాగా కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ సినిమా సక్సెస్ ను విదేశాలకు వెళ్లి తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, వచ్చేనెల మొదటి వారంలో ఇండియాకి తిరిగి రానున్నారు. 

 

కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమా భారీ సక్సెస్ మీట్ ని పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినిమా యూనిట్ సభ్యులు అందరూ కలిసి పాల్గొనే విధంగా భారీ స్థాయిలో కర్నూల్ లో జరుపనున్నట్లు సమాచారం. అయితే మొదట ఈ వేడుకని విజయవాడలో జరపాలని అనుకున్నప్పటికీ, సినిమా యొక్క బ్యాక్ డ్రాప్ కర్నూలు కావడంతో అక్కడే విజయోత్సవ వేడుకలు జరిపితే బాగుంటుందని సినిమా యూనిట్ కర్నూలును ఎంపిక చేసిందట. కాగా మరికొద్ది రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం....!!

మరింత సమాచారం తెలుసుకోండి: