రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 భాగాల అద్భుత విజయాలతో హీరోగా తన క్రేజ్ ని, అభిమానులను అలానే తన మార్కెట్ రేంజ్ ని అమాంతం బాలీవుడ్ హీరోల స్థాయికి పెంచుకున్న నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక బహుబలి విజయాల తరువాత గతేడాది ప్రభాస్ హీరోగా యువి క్రియేషన్స్ పతాకంపై యువ దర్శకుడు సూజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ సినిమా సాహో. ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. 

 

శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు పలువురు బాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రల్లో నటించడం జరిగింది. అయితే ఎంతో కష్టపడి తెరకెక్కిన సాహో సక్సెస్ కాకపోవడంతో కొంత ఆలోచనలో పడ్డ ప్రభాస్, తన తదుపరి సినిమాని యువ దర్శకుడు జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ తో చేయటానికి సిద్ధమయ్యాడు. కొన్నాళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 

 

యూరప్ బ్యాక్ డ్రాప్ లో రెట్రో ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ని మార్చి 25న, అనగా ఉగాది రోజున రిలీజ్ చేసేందుకు సినిమా యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే డార్లింగ్ ఫాన్స్ కు ఉగాది రోజున అతి పెద్ద కానుక లభించినట్లే. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో అయినా మన బాహుబలి మంచి హిట్ అందుకుని మళ్ళి ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: