తెలుగు హీరోగా పరిచయం అయి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజే మారిపోయింది. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఘనవిజయం సాధించటంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. అందుకే తన తదుపరి చిత్రం సాహోను కూడా అదే రేంజ్లో రిలీజ్ చేశాడు ప్రభాస్.
యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన సాహోకు సూపర్ హిట్ టాక్ రాకపోయినా కలెక్షన్లపరంగా మాత్రం సత్తా చాటింది. దీంతో ప్రభాస్ తదుపరి చిత్రాలను కూడా పాన్ ఇండియా లేవల్లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి తొలి అప్డేట్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
ఇటీవల ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించాడు యంగ్ రెబల్ స్టార్. అయితే ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను మార్చి 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంపై చిత్రయూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతుండటంతో అభిమానుల కోసం ఓ అప్డేట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.
ఈ సినిమా పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. ఇటలీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హైదరాబాద్లో ఇటలీని తలపించే భారీ సెట్లు నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ ఆస్ట్రాలజర్గా నటిస్తున్నాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభాస్కు జోడిగా పూజా హెగ్డే నటిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ పెదనాన కృష్ణంరాజు యూవీ క్రియేషన్స్ బ్యానర్లో కలిసి గోపికృష్ణ మూవీ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ముందుగా ఈ ఏడాది సమ్మర్లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ ప్రభాస్ సాహో తరువాత లాంగ్ గ్యాప్ తీసుకోవటంతో షూటింగ్ ఆలస్యమైంది.