కొరటాల శివ డైరక్షన్ లో మెగాస్టార్ చేస్తున్న ‘ఆచార్య’ సినిమా షూట్ చకచకా జరిగిపోతోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పడు రాజమండ్రికి షిఫ్ట్ కాబోతోంది. త్రిష తో చిరంజీవి నటించే కొన్ని కీలక సన్నివేశాలు రాజమండ్రి చుట్టు పక్కల ప్రాంతాలలో చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. 


అయితే ఈ సినిమా విడుదల మాత్రం 2021 జనవరి లో విడుదలయ్యే ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత మాత్రమే అన్న లీకులు వస్తున్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం జూలై నెలకు పూర్తి అయిపోతుంది. దీనితో ఆగష్టు నుండి చిరంజీవి ఖాళీ అయిపోతున్న పరిస్థితులలో తిరుపతి ప్రసాద్ నిర్మించబోయే లూసిఫర్ రీమేక్ షూటింగ్ ను ఈ ఏడాది సెప్టెంబర్ నుండి మొదలు పెట్టాలి అని ఆలోచనలు చిరంజీవి చేస్తున్నట్లు తెలుస్తోంది.    


వాస్తవానికి దర్శకుడు సుకుమార్ తో ఈమూవీకి దర్శకత్వం వహింప చేయాలని ఈ మూవీ స్క్రిప్ట్ ను సుకుమార్ చేత వ్రాయించారు. అయితే ప్రస్తుతం సుకుమార్ బన్నీ ప్రాజెక్ట్ మధ్య ఇరుక్కు పోవడంతో సుకుమార్ సలహాతో ఈ మూవీకి వేరే దర్శకుడుని ఎంపిక చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్ల విషయమై చిరంజీవి సుకుమార్ ల మధ్య చర్చలు జరుగుతున్నట్లు టాక్.

 

దీనితో సుకుమార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి మిస్ అయిపోయిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో కీలకమైన మరో యంగ్ కేరెక్టర్ ఉంది. ఈ పాత్రను ఎవరిచేత చేయిస్తారు అన్న విషయమై ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినా ఈ యంగ్ క్యారెక్టర్ తనకు వచ్చే విధంగా సాయి ధరమ్ తేజ్ చిరంజీవి పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ‘ప్రతిరోజు పండగే’ మూవీతో తిరిగి ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్ తనకు తన మేనమామ తో కలిసి నటించాలి అన్న కలను ఈ మూవీ తీరుస్తుందని ఆశ పడుతున్నట్లు తెలుస్తోంది..    

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: