స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ఘనవిజయం సాదించింది. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇప్పటికే వరుస పార్టీలతో సందడి చేస్తున్న బన్నీ ఇప్పుడు జాతీయ మీడియా మీద దృష్టి పెట్టాడు.
అల వైకుంఠపురంలో సినిమా రికార్డులను ప్రచారం చేస్తూ జాతీయ మీడియాలో బన్నీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి బన్నీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అంతేకాదు పలువురు ఫిలిం జర్నలిస్ట్లకు కూడా బన్నీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇప్పటికే అనుపమా చోప్రాకు ఇంటర్వ్యూ ఇవ్వగా మరికొందరి ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వీరితో పాటు కొన్ని హిందీ మీడియా సంస్థలతో కూడా ఇంట్రాక్ట్ అయ్యేందుకు బన్నీ పీఆర్ టీం ప్లాన్ చేస్తోంది.
అయితే బన్నీ ఇప్పుడు జాతీయ మీడియా మీద ఎందుకు దృష్టి పెట్టినట్టు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం యంగ్ జనరేషన్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో సినిమాలు చేస్తే మార్కెట్ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. బన్నీ కూడా అదే ఉద్దేశంతో జాతీయ స్థాయి సినిమాలు చేయాలని భావిస్తున్నాడట.
అలవైకుంఠపురములో సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటించనున్నాడన్నటాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయాల్సి ఉంది. తమిళ దర్శకుడు మురుగదాస్తోనూ బన్నీ చర్చలు జరుపుతున్నాడు.